ETV Bharat / state

నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల అయినట్టే!

లాక్​డౌన్​ వేళ మాస్కులు లేకుండా బయటకు వస్తే జేబులు ఖాళీ అవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు వేస్తూ బండ్లు సీజ్​ చేస్తున్నారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఒక్క రోజే సుమారు 30 మందికి జరిమానా వేసినట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : May 13, 2020, 7:32 PM IST

fine for no mask in bodhan city
నిబంధనలు పాటించకపోతే జేబులు గుల్ల అయినట్టే!

నిజామాబాద్ జిల్లా బోధన్​లో కోవిడ్-19 నిబంధనలను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు జరిమానా వేసి మాస్కులు అందజేస్తున్నారు. ఈరోజు సుమారు 30 మంది వాహనదారులకు జరిమానా వేశామని సీఐ పల్లె రాకేశ్​ తెలిపారు.

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి 1300 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, ప్రతీ ఒక్కరు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

నిజామాబాద్ జిల్లా బోధన్​లో కోవిడ్-19 నిబంధనలను పోలీసులు పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు జరిమానా వేసి మాస్కులు అందజేస్తున్నారు. ఈరోజు సుమారు 30 మంది వాహనదారులకు జరిమానా వేశామని సీఐ పల్లె రాకేశ్​ తెలిపారు.

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి 1300 వాహనాలను సీజ్ చేశామని పేర్కొన్నారు. ప్రజలు బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, ప్రతీ ఒక్కరు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.