ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి తండ్రీకొడుకులు మృతి

author img

By

Published : Feb 22, 2020, 10:26 PM IST

చేపల వేటకని వెళ్లిన ఆ తండ్రీ కొడుకులను మృత్యువు వెంటాడింది. కుటుంబ పెద్దను దూరం చేయటంతో పాటు... కొడుకును కూడా మింగేసి మూడేళ్ల కూతురుని, నాలుగు నెలల గర్భవతిని అనాథలను చేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్​ జిల్లా మినార్​పల్లిలో జరిగింది.

FATHER AND SON DIED DUE TO FALL IN POND
FATHER AND SON DIED DUE TO FALL IN POND

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలదీప్లాకు ఇద్దరు కొడుకులుండగా... రెండో కుమారుడు శ్రీనివాస్​తో కలిసి మద్దికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడ్డారు. ఇద్దరికీ ఈత రాకపోవటం వల్ల నీళ్లలో మునిగి మృతి చెందారు.

రెక్కాడితే గాని డొక్కా డని దయనీయ పరిస్థితిలో ఉన్న వారి కుటుంబం ఈ ఘటనతో పెద్ద దిక్కును కోల్పోయింది. శ్రీనివాస్​కి ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా.... మూడేళ్ల కూతురు ఉంది. శ్రీనివాస్ భార్య ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఘటనస్థలిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి... తండ్రీకొడుకులు మృతి

ఇదీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్​పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలదీప్లాకు ఇద్దరు కొడుకులుండగా... రెండో కుమారుడు శ్రీనివాస్​తో కలిసి మద్దికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడ్డారు. ఇద్దరికీ ఈత రాకపోవటం వల్ల నీళ్లలో మునిగి మృతి చెందారు.

రెక్కాడితే గాని డొక్కా డని దయనీయ పరిస్థితిలో ఉన్న వారి కుటుంబం ఈ ఘటనతో పెద్ద దిక్కును కోల్పోయింది. శ్రీనివాస్​కి ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా.... మూడేళ్ల కూతురు ఉంది. శ్రీనివాస్ భార్య ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఘటనస్థలిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చేపల వేటకు వెళ్లి... తండ్రీకొడుకులు మృతి

ఇదీ చూడండి : మాటలతో మాయ చేసి.. మంత్రి పేరుతో ముంచేస్తాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.