నిజామాబాద్లోని గాంధీ చౌక్లో నిజామాబాద్ డివిజన్ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమొక్రసీ నాయకులు నిరసన తెలియజేశారు. అమెరికాలో జరుగుతున్న జాత్యాహంకార దాడులు, హత్యలకు వ్యతిరేకంగా మహాత్మగాంధీ విగ్రహం ముందు మూతికి నల్లగుడ్డ కట్టుకొని న్యూ డెమొక్రసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో నల్లజాతీయులపై జరుగుతున్న దాడులు, వివక్షను అందరం కలిసి వ్యతిరేకించాలని కోరారు.
ఇవీచూడండి: మహారాష్ట్రలో రికార్డు స్థాయి కరోనా మరణాలు