నిజామాబాద్ జిల్లాలోని 56 గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న నాలుగు సర్పంచ్, 77 వార్డ్ మెంబర్ల ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.
106 మంది ప్రిసైడింగ్ అధికారులు, 119 మంది అదనపు పోలింగ్ సిబ్బంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 26వ తేదీన ఈ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో డీపీఓ జయసుధ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి