నిజామాబాద్ నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ సమావేశం నిర్వహించారు. బీడీ కార్మికులకు కనీస వేతనం 21వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు.
పనికి తగ్గ వేతనం లేక.. నిరంతరం పెరుగుతున్న ధరల వల్ల బీడీ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా అధ్యక్షులు ఏశాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెరాసపై రైతుల అభిమానం చూసి అవాక్కైన ఎర్రబెల్లి