ETV Bharat / state

ఆత్మహత్య చేసుకుంటానని సీఐ వాట్సాప్ సందేశం - ఆత్మహత్యకు పాల్పడుతన్నంటూ సీఐ వాట్సాప్ సందేశం

గత రెండు, మూడు సంవత్సరాలుగా పోలీసుల ఆత్మహత్యలు ఆ శాఖను పట్టి పీడిస్తున్నాయి. కొందరు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్య చేసుకుంటుంటే... మరికొందరేమో ఉన్నాతాధికారుల ఒత్తిడిని తట్టుకోలేక బలిదానానికి ఒడిగడుతున్నారు. తాజాగా నిజామాబాద్ కమిషనరేట్​లోని రుద్రూర్ సీఐ దామోదర్ రెడ్డి పెట్టిన 'ఆత్మహత్యే పరిష్కారమంటూ...' వాట్సాప్ సందేశం కలకలం రేపింది.

ఆత్మహత్యకు పాల్పడుతన్నంటూ సీఐ వాట్సాప్ సందేశం
author img

By

Published : Apr 29, 2019, 7:40 AM IST

Updated : Apr 29, 2019, 11:39 AM IST

నిజామాబాద్ కమిషనరేట్​లోని రుద్రూర్ సీఐ సూదిరెడ్డి దామోదర్ రెడ్డి వాట్సాప్ సందేశం కలకలం రేపుతోంది. అధికారుల ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని... నా సమస్యకు ఆత్మహత్య ఒక్కటే మార్గం అంటూ ఒక సందేశాన్ని అధికారిక వాట్సాప్ గ్రూప్​లో పంపటం చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తమైన కమిషనరేట్ అధికారులు సీఐని సెలవుపై పంపించారు.

అసలేం జరిగింది?

సీఐ దామోదర్ రెడ్డికి బంధువుల సమస్య పరిష్కారంలో భాగంగా... అవతలి వ్యక్తులను బెదిరించారని, అనంతరం సదరు వ్యక్తులు ఐజీకి ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్ రెడ్డి దీనిపై విచారణ జరిపి తుది నివేదికను ఐజీకి అందించటం వల్ల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందరాదంటూ నెల 26న ఐజీ స్టీఫెన్ రవీంద్ర మెమో జారీ చేశారు.

డీఎస్పీ పదోన్నతి జాబితాలో సీఐ

1995 బ్యాచ్​కు చెందిన దామోదర్ రెడ్డి ప్రస్తుతం డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ సమయంలో ఛార్జి మెమో ఇవ్వటం వల్ల ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. వాట్సాప్ సందేశం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషనరేట్ అధికారులు ఈ నెల 27 నుంచి సెలవులపై ఇంటికి పంపారు. ముందు జాగ్రత్తగా ఆయన సర్వీస్ రివాల్వర్​ను కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: నేడు ఇంటర్​ బోర్డు ముట్టడి, నిరవధిక నిరాహార దీక్ష

నిజామాబాద్ కమిషనరేట్​లోని రుద్రూర్ సీఐ సూదిరెడ్డి దామోదర్ రెడ్డి వాట్సాప్ సందేశం కలకలం రేపుతోంది. అధికారుల ఒత్తిడి తట్టుకోలేని విధంగా ఉందని... నా సమస్యకు ఆత్మహత్య ఒక్కటే మార్గం అంటూ ఒక సందేశాన్ని అధికారిక వాట్సాప్ గ్రూప్​లో పంపటం చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తమైన కమిషనరేట్ అధికారులు సీఐని సెలవుపై పంపించారు.

అసలేం జరిగింది?

సీఐ దామోదర్ రెడ్డికి బంధువుల సమస్య పరిష్కారంలో భాగంగా... అవతలి వ్యక్తులను బెదిరించారని, అనంతరం సదరు వ్యక్తులు ఐజీకి ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం. నిజామాబాద్ రేంజ్ డీఐజీ శివశంకర్ రెడ్డి దీనిపై విచారణ జరిపి తుది నివేదికను ఐజీకి అందించటం వల్ల చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిపాటు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు పొందరాదంటూ నెల 26న ఐజీ స్టీఫెన్ రవీంద్ర మెమో జారీ చేశారు.

డీఎస్పీ పదోన్నతి జాబితాలో సీఐ

1995 బ్యాచ్​కు చెందిన దామోదర్ రెడ్డి ప్రస్తుతం డీఎస్పీ పదోన్నతి జాబితాలో ఉన్నారు. ఈ సమయంలో ఛార్జి మెమో ఇవ్వటం వల్ల ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. వాట్సాప్ సందేశం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషనరేట్ అధికారులు ఈ నెల 27 నుంచి సెలవులపై ఇంటికి పంపారు. ముందు జాగ్రత్తగా ఆయన సర్వీస్ రివాల్వర్​ను కూడా తీసుకున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: నేడు ఇంటర్​ బోర్డు ముట్టడి, నిరవధిక నిరాహార దీక్ష

Intro:Body:Conclusion:
Last Updated : Apr 29, 2019, 11:39 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.