ETV Bharat / state

ఎన్ఎస్​జీ కమాండో భూమినే లాక్కొని దౌర్జన్యం చేశారు..!

author img

By

Published : Nov 21, 2022, 7:48 PM IST

Updated : Nov 21, 2022, 7:55 PM IST

Attack on NSG commando: దేశాన్ని రక్షించే సైనికుని పైనే దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. అక్కడితో ఆగకుండా తన భార్యను కాలితో తన్ని, జుట్టుపీకీ ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును సైతం తెంపుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా పాకాల గ్రామంలో చోటుచేసుకుంది.

ఎన్ఎస్​జీ కమాండో
ఎన్ఎస్​జీ కమాండో

Attack on NSG commando: దేశాన్ని రక్షించే సైనికుని పైనే దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. అక్కడితో ఆగకుండా తన భార్యను కాలితో తన్ని, జుట్టుపీకీ ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా, పాకాల గ్రామంలో చోటుచేసుకుంది. అసలేమైందంటే..

మూడ్​ రమేష్​ అనే ఎన్ఎస్​జీ కమాండో తాను కష్టపడి సంపాదించుకున్న దానితో కొంత భూమిని కొని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించాడు. దానిని కొందరు ప్రజాప్రతినిధులు ఆక్రమించి ఈ భూమి మాదంటూ.. తన భార్యపై దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను రమేష్​ తన బామర్ది చందు ఫోన్​లో వీడియో తీస్తుంటే వాళ్ల ఫోన్​లను లాకెళ్లారు. ఏమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన రమేష్​ను మరో సారి ఈ భూమిలోకి వస్తే ప్రాణాలు తీస్తాం.. అని బెదిరించి నాలుగురు వ్యక్తులు రమేష్​ను తరుముతూ అతనిపై గొడ్డలి విసిరి, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

వారి నుంచి ప్రాణాలు రక్షించుకున్న అతను పోలీసులకు ఫోన్​ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు రమేష్​ కూడా పొలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ వ్యక్తులు రమేష్​ను, తన బామర్ది చందును, తన భార్యను సైతం విచక్షణారహితంగా కొట్టారు. దానితో రమేష్​ తన సమస్యను నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​కు తెలియజేశారు. దానిపై స్పందిన కలెక్టర్​ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

"నేను ఆరు నెలల క్రితం నా భార్య పేరు మీదిగా 23 గుంటల భూమిని పోతిరెడ్డి అభిషేక్​రెడ్డి వద్ద కొన్నాను. సర్వే నంబర్​ 774-ఈ-1, భూమిని సెప్టెంబర్​ 20 తేది నాడు నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించాను. తర్వాత నేను సెలవులకు వచ్చి భూమిని చదునుచేయగా నా మీద అనవసరంగా ఎమ్​పీపీ బాదావతి రమేష్, శ్రీ కొండ ఎమ్​పీపీ ఎమ్ రాజేందర్​​, స్టేషన్​ తాండా సర్పంచ్​ మోహన్​, అంబర్​సింగ్​ అనే వ్యక్తి మరో 20 మంది సడెన్​గా బాదావతి రమేష్ అనే వ్యక్తి నా భార్య జుట్టుపట్టుకొని చెప్పుతో కొట్టాడు. మా రెండు ఫోన్లను లాకెళ్లిపోయారు. నన్ను చంపడానికి నలుగురు వ్యక్తులు నా వెంటపడ్డారు. వాళ్ల నుంచి తప్పించుకుని 100కు ఫోన్​ చేయగా పోలీసులు వచ్చారు. వారి ముందు కూడా విచక్షమణా రహితంగా మమల్ని కొట్టారు. రమేష్, మోహన్​, నుంచి మాకు ప్రాణ హాని ఉంది.కాబట్టి మాకు రక్షణ కల్పించి మా భూమిని మాకు ఇప్పించమని కలెక్టర్​ గారిని కలవడం జరిగింది. దినిపై విచారణ జరిపించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ గారు చెప్పారు.​"- రమేష్​, ఎన్​ఎస్​జీ కమాండో

ఎన్ఎస్​జీ కమాండో భూమినే లాక్కొని దౌర్జన్యం చేశారు..!

ఇవీ చదవండి:

Attack on NSG commando: దేశాన్ని రక్షించే సైనికుని పైనే దౌర్జన్యం చేసి దాడికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. అక్కడితో ఆగకుండా తన భార్యను కాలితో తన్ని, జుట్టుపీకీ ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా, పాకాల గ్రామంలో చోటుచేసుకుంది. అసలేమైందంటే..

మూడ్​ రమేష్​ అనే ఎన్ఎస్​జీ కమాండో తాను కష్టపడి సంపాదించుకున్న దానితో కొంత భూమిని కొని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించాడు. దానిని కొందరు ప్రజాప్రతినిధులు ఆక్రమించి ఈ భూమి మాదంటూ.. తన భార్యపై దాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను రమేష్​ తన బామర్ది చందు ఫోన్​లో వీడియో తీస్తుంటే వాళ్ల ఫోన్​లను లాకెళ్లారు. ఏమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన రమేష్​ను మరో సారి ఈ భూమిలోకి వస్తే ప్రాణాలు తీస్తాం.. అని బెదిరించి నాలుగురు వ్యక్తులు రమేష్​ను తరుముతూ అతనిపై గొడ్డలి విసిరి, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.

వారి నుంచి ప్రాణాలు రక్షించుకున్న అతను పోలీసులకు ఫోన్​ చేయడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు రమేష్​ కూడా పొలంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ వ్యక్తులు రమేష్​ను, తన బామర్ది చందును, తన భార్యను సైతం విచక్షణారహితంగా కొట్టారు. దానితో రమేష్​ తన సమస్యను నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​కు తెలియజేశారు. దానిపై స్పందిన కలెక్టర్​ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

"నేను ఆరు నెలల క్రితం నా భార్య పేరు మీదిగా 23 గుంటల భూమిని పోతిరెడ్డి అభిషేక్​రెడ్డి వద్ద కొన్నాను. సర్వే నంబర్​ 774-ఈ-1, భూమిని సెప్టెంబర్​ 20 తేది నాడు నా భార్య పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించాను. తర్వాత నేను సెలవులకు వచ్చి భూమిని చదునుచేయగా నా మీద అనవసరంగా ఎమ్​పీపీ బాదావతి రమేష్, శ్రీ కొండ ఎమ్​పీపీ ఎమ్ రాజేందర్​​, స్టేషన్​ తాండా సర్పంచ్​ మోహన్​, అంబర్​సింగ్​ అనే వ్యక్తి మరో 20 మంది సడెన్​గా బాదావతి రమేష్ అనే వ్యక్తి నా భార్య జుట్టుపట్టుకొని చెప్పుతో కొట్టాడు. మా రెండు ఫోన్లను లాకెళ్లిపోయారు. నన్ను చంపడానికి నలుగురు వ్యక్తులు నా వెంటపడ్డారు. వాళ్ల నుంచి తప్పించుకుని 100కు ఫోన్​ చేయగా పోలీసులు వచ్చారు. వారి ముందు కూడా విచక్షమణా రహితంగా మమల్ని కొట్టారు. రమేష్, మోహన్​, నుంచి మాకు ప్రాణ హాని ఉంది.కాబట్టి మాకు రక్షణ కల్పించి మా భూమిని మాకు ఇప్పించమని కలెక్టర్​ గారిని కలవడం జరిగింది. దినిపై విచారణ జరిపించి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ గారు చెప్పారు.​"- రమేష్​, ఎన్​ఎస్​జీ కమాండో

ఎన్ఎస్​జీ కమాండో భూమినే లాక్కొని దౌర్జన్యం చేశారు..!

ఇవీ చదవండి:

Last Updated : Nov 21, 2022, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.