ETV Bharat / state

ఇందూరు ఎన్నికల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు

ఒక్క లోక్​సభ నియోజకవర్గం... 185 మంది అభ్యర్థులు... మొదటిసారిగా భారీ సంఖ్యలో ఈవీఎంల వినియోగం... ఎన్నికల పరిశీలన కోసం ప్రత్యేక హెలికాప్టర్... దేశంలోనే చరిత్రాత్మకమైన ఎన్నిక...  ప్రత్యేక అధికారుల నియామకం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యక్ష పర్యవేక్షణ... దీనికి కారణం... అన్నదాతల ఆక్రోశం.

author img

By

Published : Apr 5, 2019, 7:03 AM IST

Updated : Apr 5, 2019, 7:11 AM IST

ఇందూరు ఎన్నికల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు

మద్దతు ధర కావాలన్నారు. ఎన్నికల బరిలో నిలిచి జాతీయ స్థాయికి నిరసనను తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు పసుపు, ఎర్రజొన్న రైతులు. 178 మంది అన్నదాతలు నామపత్రాలను దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 185 మంది నిజామాబాద్​ లోక్​సభ బరిలో ఉండటం వల్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

12 బ్యాలెట్ యూనిట్లు

నిజామాబాద్ ఎన్నిక కోసం మొదటిసారిగా అధునాతన ఎం-3 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. ఒక పోలింగ్ బూత్​లో 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. లోక్​సభ పరిధిలో 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2600 వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. యూ ఆకారంలో ఈవీఎంలను అమర్చనున్నారు. మూడు టేబుళ్లలో 12 ఈవీఎంలు.. ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. మొదటి ఈవీఎంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల పేర్లు, గుర్తులు, వారి ఫొటోలు... మిగతా యంత్రాల్లో స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. బరిలో ఉన్న 185 మంది అభ్యర్థులతో పాటు నోటా కలిపి మొత్తం 186 చిహ్నాలు ఉంటాయి.

ఈసీ ప్రత్యక్ష పర్యవేక్షణ

పోలింగ్ కోసం జిల్లా ఎన్నికల అధికారులు, సిబ్బంది తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. భారీగా అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎం-3 రకం యంత్రాలు బెంగళూరు నుంచి కంటెయినర్లలో నిజామాబాద్ తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఈవీఎంల మొదటి దశ పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి 700 మంది టెక్నికల్ ఇంజినీర్లు నిజామాబాద్​కు వచ్చారు.

ఏజెంట్ల సమక్షంలో నమూనా ఎన్నిక

మొదటి దశ పరిశీలన ఈనెల 7లోగా పూర్తి చేసి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. అక్కడ నుంచి పోలింగ్​కు ముందు రోజు ఈవీఎంల పంపిణీ చేస్తారు. సిబ్బంది వాటిని తీసుకొని ఎన్నికల కేంద్రాలకు చేరుకుంటారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నమూనా ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కువ మంది బరిలో ఉండటం వల్ల సమయం అధికంగా పట్టనున్న నేపథ్యంలో ఉదయం 4గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇద్దరు సిబ్బంది, ఏజెంట్లు బయటే

పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పెరిగినందున ఎన్నికల సిబ్బందితోపాటు 185 మంది అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇద్దరు పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రం బయట ఉంటారు. లోక్​సభ పరిధిలో మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆరు వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. బెల్, ఈసీఐఎల్ నుంచి వచ్చిన ఇంజినీర్లు పోలింగ్ రోజున ఉండి సమస్య తలెత్తితే పరిష్కరిస్తారు.

ఇవీ ప్రతిష్ఠాత్మకం

ఏ ఎన్నికైనా ఒకటి లేదా రెండు ఈవీఎంలు వినియోగించి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ నిజామాబాద్​లో మాత్రం ఏకంగా 12 వినియోగిస్తున్నారు. పోలింగ్ ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సమయానికి ఏర్పాట్లు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు.

ఇందూరు ఎన్నికల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు

ఇవీ చూడండి: టిక్​టాక్​ను నిషేధించండి : న్యాయస్థానం ఆదేశం

మద్దతు ధర కావాలన్నారు. ఎన్నికల బరిలో నిలిచి జాతీయ స్థాయికి నిరసనను తీసుకెళ్లాలనుకున్నారు. ఇందుకోసం భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు పసుపు, ఎర్రజొన్న రైతులు. 178 మంది అన్నదాతలు నామపత్రాలను దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో కలిపి మొత్తం 185 మంది నిజామాబాద్​ లోక్​సభ బరిలో ఉండటం వల్ల దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

12 బ్యాలెట్ యూనిట్లు

నిజామాబాద్ ఎన్నిక కోసం మొదటిసారిగా అధునాతన ఎం-3 ఈవీఎంలను ఉపయోగిస్తున్నారు. ఒక పోలింగ్ బూత్​లో 12 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. లోక్​సభ పరిధిలో 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2600 వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. యూ ఆకారంలో ఈవీఎంలను అమర్చనున్నారు. మూడు టేబుళ్లలో 12 ఈవీఎంలు.. ఒక కంట్రోల్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. మొదటి ఈవీఎంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల పేర్లు, గుర్తులు, వారి ఫొటోలు... మిగతా యంత్రాల్లో స్వతంత్ర అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. బరిలో ఉన్న 185 మంది అభ్యర్థులతో పాటు నోటా కలిపి మొత్తం 186 చిహ్నాలు ఉంటాయి.

ఈసీ ప్రత్యక్ష పర్యవేక్షణ

పోలింగ్ కోసం జిల్లా ఎన్నికల అధికారులు, సిబ్బంది తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. భారీగా అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎం-3 రకం యంత్రాలు బెంగళూరు నుంచి కంటెయినర్లలో నిజామాబాద్ తీసుకొచ్చారు. రెండు రోజులుగా ఈవీఎంల మొదటి దశ పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి 700 మంది టెక్నికల్ ఇంజినీర్లు నిజామాబాద్​కు వచ్చారు.

ఏజెంట్ల సమక్షంలో నమూనా ఎన్నిక

మొదటి దశ పరిశీలన ఈనెల 7లోగా పూర్తి చేసి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నారు. అక్కడ నుంచి పోలింగ్​కు ముందు రోజు ఈవీఎంల పంపిణీ చేస్తారు. సిబ్బంది వాటిని తీసుకొని ఎన్నికల కేంద్రాలకు చేరుకుంటారు. అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నమూనా ఎన్నిక నిర్వహిస్తారు. ఎక్కువ మంది బరిలో ఉండటం వల్ల సమయం అధికంగా పట్టనున్న నేపథ్యంలో ఉదయం 4గంటలకే మాక్ పోలింగ్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఇద్దరు సిబ్బంది, ఏజెంట్లు బయటే

పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పెరిగినందున ఎన్నికల సిబ్బందితోపాటు 185 మంది అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇద్దరు పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రం బయట ఉంటారు. లోక్​సభ పరిధిలో మొత్తం 1,788 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆరు వేల మందికి పైగా పోలింగ్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. బెల్, ఈసీఐఎల్ నుంచి వచ్చిన ఇంజినీర్లు పోలింగ్ రోజున ఉండి సమస్య తలెత్తితే పరిష్కరిస్తారు.

ఇవీ ప్రతిష్ఠాత్మకం

ఏ ఎన్నికైనా ఒకటి లేదా రెండు ఈవీఎంలు వినియోగించి ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ నిజామాబాద్​లో మాత్రం ఏకంగా 12 వినియోగిస్తున్నారు. పోలింగ్ ఎలా నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకు అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సమయానికి ఏర్పాట్లు పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు.

ఇందూరు ఎన్నికల కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు

ఇవీ చూడండి: టిక్​టాక్​ను నిషేధించండి : న్యాయస్థానం ఆదేశం

Last Updated : Apr 5, 2019, 7:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.