ETV Bharat / state

వైద్య కళాశాలకు మృతదేహం దానం.. - dead body donation to medical college

వైద్య కళాశాలకు తన తండ్రి మృతదేహాన్ని దానం చేసి సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నారు పౌర హక్కుల సంఘం నేత. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన జరిగింది.

dead body donation to medical college
వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత, నిజామాబాద్​
author img

By

Published : Mar 26, 2021, 6:59 PM IST

నిజామాబాద్ జిల్లాలో పౌర హక్కుల సంఘం నేత తన తండ్రి మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు దానం చేశారు. వైద్య విద్యార్థుల ప్రయోగాలు చేసుకునేందుకు వీలుగా మృతదేహాన్ని అప్పగించారు. జక్రాన్​పల్లి మండలం పుప్పాలపల్లికి చెందిన పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రవీందర్ తండ్రి లింగయ్య అనారోగ్యంతో మరణించారు. తన తండ్రి మృతదేహం సమాజానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన పార్థివ దేహాన్ని నిజామాబాద్ వైద్య కళాశాలకు దానం చేశారు.

ఈ మేరకు నగరంలోని కోటగల్లీ ఎన్ఆర్​భవన్​కు లింగయ్య మృతదేహాన్ని తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. వామపక్ష నేతలు, పౌర హక్కుల సంఘం నాయకులు నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్​లో వైద్య కళాశాలకు తరలించారు.

నిజామాబాద్ జిల్లాలో పౌర హక్కుల సంఘం నేత తన తండ్రి మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు దానం చేశారు. వైద్య విద్యార్థుల ప్రయోగాలు చేసుకునేందుకు వీలుగా మృతదేహాన్ని అప్పగించారు. జక్రాన్​పల్లి మండలం పుప్పాలపల్లికి చెందిన పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రవీందర్ తండ్రి లింగయ్య అనారోగ్యంతో మరణించారు. తన తండ్రి మృతదేహం సమాజానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన పార్థివ దేహాన్ని నిజామాబాద్ వైద్య కళాశాలకు దానం చేశారు.

ఈ మేరకు నగరంలోని కోటగల్లీ ఎన్ఆర్​భవన్​కు లింగయ్య మృతదేహాన్ని తరలించి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచారు. వామపక్ష నేతలు, పౌర హక్కుల సంఘం నాయకులు నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్​లో వైద్య కళాశాలకు తరలించారు.

ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వంతో కేసీఆర్​కు చీకటి ఒప్పందం: సంపత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.