ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​ - కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ మున్సిపాల్​ అధికారులతో సమీక్ష

నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పురపాలక శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్​లో మున్సిపల్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

nirmal district collector musharraf farooqi review meeting with municipal officers
పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​
author img

By

Published : Aug 5, 2020, 7:32 PM IST

జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారును జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సూచించారు. పట్టణప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్యం, పట్టణప్రగతి పనులపై పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పట్టణ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని, ప్రతి వార్డులో ట్రీ పార్కులు, నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రతి నెల ఆస్తి పన్నులు వాసూలు చేయాలన్నారు. టౌన్​ప్లానింగ్ అధికారులు, బిల్ కలెక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు.

రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్ల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఆగస్టు 15న మున్సిపల్​ కార్మికులకు ప్రత్యేక జాకెట్లు, గ్లౌజలు, బూట్లు పంపిణీ చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లేఔట్లు, భవనాలను నిలిపివేయాలన్నారు. ఛైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ఇవీచూడండి: నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేసిన కరోనా

జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారును జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ సూచించారు. పట్టణప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్యం, పట్టణప్రగతి పనులపై పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పట్టణ పార్కుల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని, ప్రతి వార్డులో ట్రీ పార్కులు, నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో ప్రతి నెల ఆస్తి పన్నులు వాసూలు చేయాలన్నారు. టౌన్​ప్లానింగ్ అధికారులు, బిల్ కలెక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు.

రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ మిషన్ల కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఆగస్టు 15న మున్సిపల్​ కార్మికులకు ప్రత్యేక జాకెట్లు, గ్లౌజలు, బూట్లు పంపిణీ చేయాలన్నారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న లేఔట్లు, భవనాలను నిలిపివేయాలన్నారు. ఛైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

ఇవీచూడండి: నిర్మాణ రంగాన్ని అతలాకుతలం చేసిన కరోనా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.