నిర్మల్ జిల్లాలో రూర్బన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముషార్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూర్బన్ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు.
పట్టణ ప్రాంతాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్ పథకం ప్రవేశపెట్టిందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో పథకం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టి కనీస మౌలిక సదుపాయాలతోపాటు గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.
ఇదీ చదవండి: నవంబర్ నెలాఖరు వరకు అన్లాక్-5 నిబంధనలే