ETV Bharat / state

భైంసా మున్సిపల్​ కార్యాలయంలో పౌరసేవా కేంద్రం ప్రారంభం

భైంసా పట్టణంలోని మున్సిపల్​ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని నిర్మల్​ జిల్లా పాలనాధికారి, ముధోల్​ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఆత్మనిర్భర్​ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు, నిరుపేదలకు 10వేల రూపాయల చెక్కులను అందజేశారు.

author img

By

Published : Nov 12, 2020, 5:18 PM IST

nirmal collector Launched Civil Service Center at Bhainsa Municipal Office
భైంసా మున్సిపల్​ కార్యాలయంలో పౌరసేవా కేంద్రం ప్రారంభం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్​ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ఆత్మనిర్భర్​​ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు, నిరుపేదలకు 10వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలో రోడ్లు ఊడ్చే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

పట్టణప్రగతిలో భాగంగా భైంసా పట్టణానికి ఒక స్వీపింగ్​ యంత్రాన్ని ఇచ్చామని జిల్లా కలెక్టర్​ తెలిపారు. 3 నెలల నుంచి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మున్సిపల్​ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం ఆత్మనిర్భర్​​ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు, నిరుపేదలకు 10వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలో రోడ్లు ఊడ్చే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

పట్టణప్రగతిలో భాగంగా భైంసా పట్టణానికి ఒక స్వీపింగ్​ యంత్రాన్ని ఇచ్చామని జిల్లా కలెక్టర్​ తెలిపారు. 3 నెలల నుంచి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

ఇవీ చూడండి: 'బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు మేలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.