ETV Bharat / state

తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం

అనారోగ్యంతో బాధపడుతున్నాడని భార్య వదిలేసినా, తనయుడికి కడదాకా ఓ మాతృమూర్తి తోడుగా నిలిచింది. కుమారుడి చావును చూసి తట్టుకోలేక తల్లి పడిన రోదన అందరిని కలచివేసింది. ఈ ఘటన నిర్మల్​ జిల్లా ముథోల్​లో చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 30, 2019, 1:38 PM IST

తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం
తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం

నవమాసాలు మోసి కనిపెంచిన ఓ తల్లి... తనయునికి కడదాకా తోడైంది. అనారోగ్యం కారణంగా కట్టుకున్న భార్య అర్ధాంతరంగా వదిలేసినా... కడదాకా తోడు ఉంటానంటూ శత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కుమారుడు దక్కలేదు. కళ్ల ముందే తనయుడు తనను వీడుతుండగా ఆ తల్లి రోదన అందరిని కలచివేసింది.

తల్లి రోదనను చూసి కంటతడిపెట్టుకున్న ప్రయాణికులు

మహారాష్ట్రలోని ఉమ్రి పక్కన ఉన్న సవర్గావ్ గ్రామానికి చెందిన కుమ్మర్వర్ ఆనంద కిడ్నీ వ్యాధితో గత మూడు నెలలుగా బాధపడుతున్నాడు. మొదట ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చూపించినపుడు కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పడం వల్ల భార్య వదిలేసింది. గత కొన్ని రోజుల నుంచి కన్న తల్లే నిజామాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తోంది. ముథోల్ నుంచి నిజామాబాద్​కు వెళ్లడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను అకస్మాత్తుగా చనిపోయాడు. బస్టాండ్​లో తనయుడి మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఆ తల్లిని చూసి పలువురు ప్రయాణికులు కూడా కంటతడి పెట్టారు.

ఇవీ చూడండి: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాదే బాద్​షా

తనయుడికి కడదాకా తోడుగా నిలిచిన పేగు బంధం

నవమాసాలు మోసి కనిపెంచిన ఓ తల్లి... తనయునికి కడదాకా తోడైంది. అనారోగ్యం కారణంగా కట్టుకున్న భార్య అర్ధాంతరంగా వదిలేసినా... కడదాకా తోడు ఉంటానంటూ శత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ కుమారుడు దక్కలేదు. కళ్ల ముందే తనయుడు తనను వీడుతుండగా ఆ తల్లి రోదన అందరిని కలచివేసింది.

తల్లి రోదనను చూసి కంటతడిపెట్టుకున్న ప్రయాణికులు

మహారాష్ట్రలోని ఉమ్రి పక్కన ఉన్న సవర్గావ్ గ్రామానికి చెందిన కుమ్మర్వర్ ఆనంద కిడ్నీ వ్యాధితో గత మూడు నెలలుగా బాధపడుతున్నాడు. మొదట ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చూపించినపుడు కిడ్నీ సమస్య ఉందని వైద్యులు చెప్పడం వల్ల భార్య వదిలేసింది. గత కొన్ని రోజుల నుంచి కన్న తల్లే నిజామాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తోంది. ముథోల్ నుంచి నిజామాబాద్​కు వెళ్లడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను అకస్మాత్తుగా చనిపోయాడు. బస్టాండ్​లో తనయుడి మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చున్న ఆ తల్లిని చూసి పలువురు ప్రయాణికులు కూడా కంటతడి పెట్టారు.

ఇవీ చూడండి: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాదే బాద్​షా

Intro: TG_ADB_60_30_MUDL_VIDANI PEGU BANDAM_AVB_C12


*వీడని పేగు బంధం*
అనారోగ్యంతో బడపడుతున్నదని భార్య వదిలేసిన కడదాకా తోడుగా ఉన్న మాతృమూర్తి

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి తనాయున్ని కడదాకా తోడైంది తనకు అనారోగ్యంగా ఉందని ఏడాడుగులు నడిచి కడదాకా తోడు ఉంటన్న భార్య అర్దాంతరంగా వదిలి వేయడంతో ఆకరికి ఆ మాతృమూర్తి కడదాకా తోడైంది కేవలం అనారోగ్య కారణంగా కట్టుకున్న భార్య అర్దాంతరంగా వదిలేసినప్పటికి జన్మనిచ్చిన తల్లి కడదాకా తోడు వుంటానంటూ పట్టు వదలని విక్రమార్కుడీలా శత ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ మాతృమూర్తి కి తనయుడు దక్కలేదు కళ్ళ ముందే తన తనయుడు తనను విడుతుండగా ఆ మాతృమూర్తి వేదన రోదన అందరిని కలచి వేసిన సంఘటన ముధోల్ బస్టాండ్ లో చుట్టు చేసుకుంది
మహారాష్ట్ర లోని ఉమ్రి ప్రక్కన ఉన్న సవర్గావ్ గ్రామానికి చెందిన కుమ్మర్వర్ ఆనంద s% పోశెట్టి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ముధోల్ బస్టాండు లో మరణించాడు,ఆనంద గత మూడు నెలల నుండి కిడ్నీ బాధతో బాధపడుతున్న అతనికి కన్నా తల్లి,భార్య మొదట మోంబాయి లోని ఓ ఆసుపత్రిలో చూపించినపుడు కిడ్నీ బాధితుడు అని వైద్యులు తెలపడంతో అతడి భార్య 7 సంవత్సరం నుండి కలసి ఉన్న వదిలేసింది గత కొన్ని రోజుల నుండి కన్నా తల్లి నిజామాబాద్ ఓ ఆసుపత్రిలో చూపిస్తూ వచ్చింది పోయిన శుక్రవారం రోజు ఆసుపత్రికి వెళ్లి వచ్చాము వైద్యులు సోమవారం రమ్మని తెలిపారు,అయితే నిన్న డబ్బులు లేకపోవడంతో ఈ రోజు ప్రొద్దున ఉమ్రి నుండి భైంసా కు రోజు వారిగా వచ్చే బస్ లో వచ్చారు ముధోల్ నుంచి నిజామాబాద్ బస్ కు ఎదురు చూస్తు కూర్చున్న సమయంలో మరణించాడు బస్టాండ్ లో తనయుడి మరణించడంతో ఏడుస్తూ కూర్చున్న తల్లి ని చూసి పలువురు ప్రయాణికులు రోదించారు




Body:ముధోల్


Conclusion:ముధోల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.