నిర్మల్ జిల్లా మామడ మండలం కొరిటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కోర్టులు, పల్లె ప్రకృతి వనాలను శనివారం డీఆర్డీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. గ్రామాల్లో వానరాల బెడదను తప్పించేందుకే ప్రభుత్వం ఈ మంకీ ఫుడ్కోర్టులు ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. కోతులు ఇష్టంగా తినే పండ్లచెట్లను వాటిలో పెంచనున్నట్టు తెలిపారు.
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చదనంతో నిండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాపురెడ్డి, ఎంపీడీఓ రమేష్, ఏపీఓ శివాజీ, కార్యదర్శి సురేష్, టీఏ కరీం, అశోక్ పాల్గొన్నారు.