ETV Bharat / state

పోతులూరి ఆలయం.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి - Indrakaran Reddy visit nirmal temple

నిర్మల్​లోని బైల్ బజార్ సమీపంలో శ్రీ పోతులూరి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి-గోవిందాంబల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు.

Minister allola indrakaran reddy participating in special pujas in Potuluri Temple at nirmal
పోతులూరి ఆలయం.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి
author img

By

Published : Feb 27, 2021, 7:34 PM IST

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ సమీపంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహార్దశ వచ్చిందని మంత్రి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 500పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్​సీఎస్ ఛైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ సమీపంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహార్దశ వచ్చిందని మంత్రి అన్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 500పైగా ఆలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్​సీఎస్ ఛైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, కౌన్సిలర్లు నేరెళ్ల వేణు, అయ్యన్నగారి రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పాతగుట్ట బ్రహ్మోత్సవాలు: కన్నుల పండువగా పూర్ణాహుతి, చక్రస్నానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.