ETV Bharat / state

పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: మంత్రి అల్లోల - నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా ముధోల్ మండలం బొరిగాంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్​రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

Minister Allola inaugurates rice procurement center in Borigam Nirmal district
పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: మంత్రి అల్లోల
author img

By

Published : Nov 1, 2020, 10:41 PM IST

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బొరిగాం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్​రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరి పంట మద్దతు ధర క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

గత సంవత్సరం కంటే ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని.. పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రైతు వేదికలు పూర్తయిన తర్వాత రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. రైతులను సంఘటితం చేస్తామని తెలిపారు.

నిర్మల్ జిల్లా ముధోల్ మండలం బొరిగాం గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్​రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరి పంట మద్దతు ధర క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

గత సంవత్సరం కంటే ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని.. పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా రైతు వేదికలు పూర్తయిన తర్వాత రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి.. రైతులను సంఘటితం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: ఔరా..! అచ్చం కార్పెట్​లానే ఉందే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.