ETV Bharat / state

స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

author img

By

Published : Apr 30, 2020, 11:21 PM IST

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు స్వస్థలాలకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో గుజరాత్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు 60 బస్సుల్లో బయల్దేరిన 4500 మంది వలస కూలీలు తెలంగాణ మీదుగా సొంతూళ్లకు చేరుకోనున్నారు.

Migration Labor Going to Own Places
స్వస్థలాలకు చేరుకోనున్న 4500 మంది వలస కార్మికులు

మహారాష్ట్ర- నిర్మల్ సరిహద్దు అయిన తానూర్ మండలం బెల్​ తారోడ చెక్​పోస్టు వద్ద గుజరాత్​లోని గిరి సోమనాథ్​ నుంచి 60 బస్సులలో 4500 మంది వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వారు సొంతూళ్లకు చేరుకోనున్నారు. ఈ మేరకు నిర్మల్​ జిల్లా సరిహద్దులో డీఎస్పీ, రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి తెలంగాణ మీదుగా ప్రయాణించేందుకు అనుమతులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వలస కూలీలను స్వస్థలాలకు పంపడానికి గుజరాత్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్తున్న వలస కార్మికుల బస్సులను తనిఖీలు చేసి తెలంగాణలోకి అనుమతించామని డీఎస్పీ నర్సింగ్​ రావు తెలిపారు.

మహారాష్ట్ర- నిర్మల్ సరిహద్దు అయిన తానూర్ మండలం బెల్​ తారోడ చెక్​పోస్టు వద్ద గుజరాత్​లోని గిరి సోమనాథ్​ నుంచి 60 బస్సులలో 4500 మంది వలస కూలీలు స్వస్థలాలకు బయల్దేరారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా వారు సొంతూళ్లకు చేరుకోనున్నారు. ఈ మేరకు నిర్మల్​ జిల్లా సరిహద్దులో డీఎస్పీ, రెవిన్యూ అధికారులు తనిఖీలు చేసి తెలంగాణ మీదుగా ప్రయాణించేందుకు అనుమతులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వలస కూలీలను స్వస్థలాలకు పంపడానికి గుజరాత్​ నుంచి ఆంధ్రప్రదేశ్​కు వెళ్తున్న వలస కార్మికుల బస్సులను తనిఖీలు చేసి తెలంగాణలోకి అనుమతించామని డీఎస్పీ నర్సింగ్​ రావు తెలిపారు.

ఇవీ చూడండి:నిరాహార దీక్ష విరమించిన వీహెచ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.