ETV Bharat / state

ఐకేఆర్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

నిర్మల్​లోని పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా కార్యకర్తలకు, పేదలకు ఐకేఆర్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : Apr 16, 2020, 10:04 AM IST

groceries distribution by ikr foundation in nirmal
ఐకేఆర్​ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న నిర్మల్​లోని రోజువారీ కూలీలు, నిరుపేదలకు ఐకేఆర్​ ఫౌండేషన్​ బాసటగా నిలుస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్​ ఛైర్మన్​ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి సహకారంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 220 మందికి సరకులు పంపిణీ చేశారు.

360మంది మున్సిపల్ కార్మికులు, 220మంది ఆశా వర్కర్లు, 1000 మంది ఆసుపత్రి సిబ్బంది, పేదలకు నిత్యావసర సరకులు అందించారు. కరోనా విజృంభిస్తున్నా... ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్​ అలీ, మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్​ బాలక్రిష్ణ పాల్గొన్నారు.

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న నిర్మల్​లోని రోజువారీ కూలీలు, నిరుపేదలకు ఐకేఆర్​ ఫౌండేషన్​ బాసటగా నిలుస్తోంది. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్​ ఛైర్మన్​ అల్లోల గౌతంరెడ్డి, దివ్యారెడ్డి సహకారంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 220 మందికి సరకులు పంపిణీ చేశారు.

360మంది మున్సిపల్ కార్మికులు, 220మంది ఆశా వర్కర్లు, 1000 మంది ఆసుపత్రి సిబ్బంది, పేదలకు నిత్యావసర సరకులు అందించారు. కరోనా విజృంభిస్తున్నా... ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్​ అలీ, మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్​ బాలక్రిష్ణ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.