ETV Bharat / state

విషాదం: పిడుగుపాటుకు మహిళా రైతు మృతి

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళా రైతు మృతి చెందింది.

author img

By

Published : Oct 1, 2020, 12:26 AM IST

Female farmer killed in lightning strike at  Dilawarpur Zone, Nirmal District
విషాదం: పిడుగుపాటుకు మహిళా రైతు మృతి

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండలం కాల్వతండాలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళా రైతు మృతి చెందింది. గ్రామానికి చెందిన మెగావత్ కవిత (35) అనే మహిళ రైతు తన పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకుంటుంది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో ఒక్క సారిగా ఆమెపై పిడుగు పడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్ఐ సంజీవ్ కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరితో కలుపుగోలుగా ఉండే కవిత మృతిచెందడంతో కాల్వతండా వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.

నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండలం కాల్వతండాలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళా రైతు మృతి చెందింది. గ్రామానికి చెందిన మెగావత్ కవిత (35) అనే మహిళ రైతు తన పంట చేనులో వ్యవసాయ పనులు చేసుకుంటుంది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో ఒక్క సారిగా ఆమెపై పిడుగు పడటం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది.

ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్ఐ సంజీవ్ కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందరితో కలుపుగోలుగా ఉండే కవిత మృతిచెందడంతో కాల్వతండా వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.

ఇదీ చదవండి: ఎన్నికల కోడ్​ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.