ETV Bharat / state

'పెట్రో ధరలు తగ్గించాలి.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి' - Nirmal News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వ్యతికేరిస్తూ నిర్మల్​ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని డిమాండ్​ చేశారు.

CPI (ML) Protest In Nirmal Collector Office
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసిస్తూ న్యూ డెమోక్రసీ ధర్నా
author img

By

Published : Jun 23, 2020, 8:00 PM IST

నిర్మల్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని, లాక్​డౌన్​ సమయంలో ప్రజలపై విద్యుత్​ భారాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని గానీ.. ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. విద్యుత్​ బిల్లులను రద్దు చేసి.. 300 యూనిట్ల వరకు ప్రభుత్వమే ఉచిత విద్యుత్​ అందించాలని డిమాండ్​ చేశారు. కరోనా పరీక్షలకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.

నిర్మల్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం ముందు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గించాలని, లాక్​డౌన్​ సమయంలో ప్రజలపై విద్యుత్​ భారాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలని గానీ.. ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, నిరంకుశంగా వ్యవహరించడం సరికాదన్నారు. విద్యుత్​ బిల్లులను రద్దు చేసి.. 300 యూనిట్ల వరకు ప్రభుత్వమే ఉచిత విద్యుత్​ అందించాలని డిమాండ్​ చేశారు. కరోనా పరీక్షలకు ప్రభుత్వమే ఖర్చులు భరించాలని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని కోరారు.

ఇవీ చూడండి: కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.