ETV Bharat / state

జిల్లాలో వంద శాతం ప్రసవాల జరగాలి: నిర్మల్ కలెక్టర్ - జిల్లాలో వంద శాతం ప్రసవాల జరిగాలి: నిర్మల్ కలెక్టర్

నిర్మల్​ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాలపై వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ ముషర్రఫ్​ ఫారూఖీ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100 శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

collector meeting at nirmal district with health officers
జిల్లాలో వంద శాతం ప్రసవాల జరగాలి: నిర్మల్ కలెక్టర్
author img

By

Published : Aug 14, 2020, 8:54 PM IST

నిర్మల్​ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వందశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100 శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు తెలిపారు.

గర్భిణులకు, కుటుంబసభ్యులకు ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ.. అప్రమత్తంగా ఉంటే మరణాల రేటును తగ్గించాలన్నారు. కొవిడ్​పై ప్రజలు భయపడకుండా వారు అన్ని జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

నిర్మల్​ జిల్లాలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వందశాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాలపై వైద్యులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100 శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు తెలిపారు.

గర్భిణులకు, కుటుంబసభ్యులకు ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ప్రసవాల వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని.. ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ.. అప్రమత్తంగా ఉంటే మరణాల రేటును తగ్గించాలన్నారు. కొవిడ్​పై ప్రజలు భయపడకుండా వారు అన్ని జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.