నారాయణపేట జిల్లా గుడిగండ్ల గ్రామంలో దశాబ్దాలుగా అనేకమంది యువత... ఉపాధి కరువై పొట్టకూటి కోసం పట్నాల బాట పడుతూనే ఉన్నారు. సొంతవారికి దూరంగా ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కానీ కరోనా మహమ్మారి వల్ల వారు ఆ ఉపాధిని కూడా కోల్పోయి... మళ్లీ సొంత గ్రామానికి వచ్చేశారు.
వైరస్ తగ్గుముఖం పట్టినా... కొందరు నగరాలకు వెళ్లినా... అధిక శాతం యువత మాత్రం గ్రామంలోనే ఉంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. గుడిగండ్లకు చెందిన శ్రీను... పదేళ్ల క్రితం భార్యా పిల్లలతో హైదరాబాద్కు వలస వెళ్లారు. అక్కడ హోటల్లో మాస్టారుగా పని చేసేవారు. లాక్డౌన్ సమయంలో గ్రామానికి వచ్చిన శ్రీను... సంపాదించిన కొద్దిపాటి సొమ్ముతో తోపుడు బండి చేయించుకొని... టిఫిన్ సెంటర్ నడుపుతూ రోజుకు 400 వరకు సంపాదిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర గౌడ్ ఐదేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లారు. మెడికల్ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేసేన అతను టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
ఇదీ చూడండి: వంశీ సందేశాత్మక చిత్రం.. ఈ 'స్వార్థం'