ETV Bharat / state

రైతు అవగాహన సదస్సుకు ఏర్పాట్లు సిద్ధం

సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా నారాయణపేటలో గురువారం రైతు అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి తెలిపారు.

author img

By

Published : May 27, 2020, 6:28 PM IST

District Officers review the Farmer Awareness Seminar arrangements in Narayanapeta
రైతు అవగాహన సదస్సుకు ఏర్పాట్లు సిద్ధం

నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం రైతు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్​ హరిచందన, ఎస్పీ చేతనతో కలిసి సందర్శించారు. సమావేశానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులు, తహసీల్దార్​ పాల్గొన్నారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలో గురువారం రైతు అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్​ హరిచందన, ఎస్పీ చేతనతో కలిసి సందర్శించారు. సమావేశానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, వ్యవసాయ అధికారులు, తహసీల్దార్​ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.