రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం 12 ఏళ్ల కిందట నల్గొండ జిల్లా చండూరు మండలానికి వలస వచ్చింది. దేవుళ్లు, దిష్టి బొమ్మల విగ్రహాలను తయారు చేస్తూ ఆ కుటుంబ సభ్యులు జీవనం సాగించేవారు. కానీ తయారుచేసే చోటుకు కొనుగోలుదారులు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అందుకే ఓ వినూత్న ఆలోచన చేశారు.
రూ. 70 వేలు ఖర్చు చేసి ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి దానికే ఓ ట్రాలీని ఏర్పాటు చేసుకున్నారు. వారు తయారు చేసిన బొమ్మలను ఆ ట్రాలీలో వేసుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముతున్నారు. ఖర్చులు పోను రూ. 1000 వరకు కూలీ దొరుకుతుందని వారు తెలిపారు.
ఇదీ చదవండి: నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు