ETV Bharat / state

Cotton Price Hike: మార్కెట్లలో పత్తి దూకుడు.. ‘మద్దతు’ను మించిన ధర

author img

By

Published : Oct 27, 2021, 9:20 AM IST

తెలంగాణ మార్కెట్లో పత్తి ధర దూసుకుపోతోంది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. పలు జిల్లాల్లో మద్దతు ధరకు మించి ప్రైవేటు వ్యాపారులే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతన్నల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆగస్టులో వర్షాలతో కొంత పంట నాశనమైనా.. మిగిలిన పంటకు మంచి ధర పలకడంతో ఉపశమనం చెందుతున్నారు. ఈ సారి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు లేనట్లేనని అధికారులు అంటున్నారు.

Cotton Price Hike in telangana
తెలంగాణలో పత్తి ధర

క్వింటాలు పత్తి మంగళవారం గరిష్ఠ(Cotton Price Hike) ధర పలికింది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యధికంగా రూ. 8,350 లభించింది. మరో నాలుగు జిల్లాల్లోనూ 8 వేల మార్కును దాటింది. ఈ ప్రభావంతో ఈసారి కొనుగోళ్ల(Cotton Price Hike) కు సీసీఐ మంగళం పాడుతోంది. మద్దతు ధర కన్నా రూ.2 వేలు ఎక్కువ పలుకుతుండటంతో ఇక సీసీఐ కొనుగోళ్లు లేనట్లేనని జిల్లాల యంత్రాంగాలు అంటున్నాయి.

తేమ ఉన్నా మంచి ధరే

అంతర్జాతీయ విపణిలో పత్తి(Cotton Price Hike) కి భారీగా డిమాండ్ ఉంటున్నా... అనుకున్న రీతిలో దిగుబడులు లేకపోవడంతో ఈ సీజన్​లో పెద్ద ఎత్తున ధరలు వస్తున్నాయి. కొనుగోళ్లపై సీసీఐ ఆసక్తి చూపకపోవడంతో అన్నిచోట్లా ప్రైవేటు వ్యాపారులే పత్తి(Cotton Price Hike) ని కొంటున్నారు. ఈ సీజన్​కు రాష్ట్రంలో 42 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారం సాగవగా 3 కోట్ల క్వింటాళ్ల దిగుబడులు ఉంటాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 376 జిన్నింగ్ మిల్లులుండగా సీసీఐ(Cotton Price Hike) కొనుగోళ్లు లేకపోవడంతో వాటన్నింట్లోనూ అక్కడి యజమానులే పంటను కొంటున్నారు. సోమవారం ఉదయం రూ. 7,600 ఉన్న ధర సాయంత్రానికి మరో రూ. 100 పెరిగింది. ఆదివారం ఉదయం క్వింటాకు రూ. 7,500, సాయంత్రం రూ. 7,600 పలికింది. ఇలా రెండు రోజులపాటు ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనపడగా మంగళవారం మాత్రం ఊహించని స్థాయికి చేరుకుంది. అటు సీడ్ ధరలు సైతం ఈసారి అనూహ్యంగా పెరిగాయి. క్వింటాలుకు రూ. 3,400 లభిస్తోంది. ఇది గతేడాది గరిష్ఠంగా రూ. 2,100 మాత్రమే పలికింది.

రికార్డు స్థాయిలో

వరంగల్ జిల్లా నెక్కొండలో మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా తెల్ల బంగారం(Cotton Price Hike) క్వింటాకు 8 వేల 350 రూపాయలు పలికింది. గత కొన్నేళ్లలో ఈ స్థాయి ధరలు చూడలేదని అధికారులు అంటున్నారు. గజ్వేల్​లో రూ. 8,261, జమ్మికుంట, నారాయణపేటలో రూ. 8,150, ఆదిలాబాద్​లో రూ. 8,020 దక్కింది. ఇక అత్యల్పంగా నారాయణఖేడ్​లో రూ. 6,025 పలికింది. నారాయణఖేడ్​లో దక్కిన ధర ఎంఎస్పీ(MSP)తో సమానంగా ఉంది.

రైతుల ఆశలు చిగురించే

ధరలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా సాగుదారులు సైతం పంటను(Cotton Price Hike) వెంటనే విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి దిగుబడులు సగానికి సగం తగ్గినా చేతికందిన పంటయితే నాణ్యంగా ఉంది. ఆగస్టులో వర్షాల వల్ల చేలల్లో నీరు చేరి... పంట పనికిరాకుండా పోయింది. అటు పెట్టుబడులు, కౌలు ధరలు పెరగడంతో రైతన్నలు అప్పులు తెచ్చి పత్తిని కాపాడుకోవాల్సి వచ్చింది. అందిన అరకొర దిగుబడులకైనా ఇప్పుడు మంచి ధరలు చేతికి అందుతుండటంతో సాగుదారుల్లో ఉపశమనం కనిపిస్తోంది.

.

ఇదీ చదవండి: RATES ON MIDDLE CLASS: అటు ఇంధన ధరలు.. ఇటు నిత్యావసరాలు.. మధ్యలో సామాన్యుడు

క్వింటాలు పత్తి మంగళవారం గరిష్ఠ(Cotton Price Hike) ధర పలికింది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యధికంగా రూ. 8,350 లభించింది. మరో నాలుగు జిల్లాల్లోనూ 8 వేల మార్కును దాటింది. ఈ ప్రభావంతో ఈసారి కొనుగోళ్ల(Cotton Price Hike) కు సీసీఐ మంగళం పాడుతోంది. మద్దతు ధర కన్నా రూ.2 వేలు ఎక్కువ పలుకుతుండటంతో ఇక సీసీఐ కొనుగోళ్లు లేనట్లేనని జిల్లాల యంత్రాంగాలు అంటున్నాయి.

తేమ ఉన్నా మంచి ధరే

అంతర్జాతీయ విపణిలో పత్తి(Cotton Price Hike) కి భారీగా డిమాండ్ ఉంటున్నా... అనుకున్న రీతిలో దిగుబడులు లేకపోవడంతో ఈ సీజన్​లో పెద్ద ఎత్తున ధరలు వస్తున్నాయి. కొనుగోళ్లపై సీసీఐ ఆసక్తి చూపకపోవడంతో అన్నిచోట్లా ప్రైవేటు వ్యాపారులే పత్తి(Cotton Price Hike) ని కొంటున్నారు. ఈ సీజన్​కు రాష్ట్రంలో 42 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారం సాగవగా 3 కోట్ల క్వింటాళ్ల దిగుబడులు ఉంటాయని అంచనా. రాష్ట్రవ్యాప్తంగా 376 జిన్నింగ్ మిల్లులుండగా సీసీఐ(Cotton Price Hike) కొనుగోళ్లు లేకపోవడంతో వాటన్నింట్లోనూ అక్కడి యజమానులే పంటను కొంటున్నారు. సోమవారం ఉదయం రూ. 7,600 ఉన్న ధర సాయంత్రానికి మరో రూ. 100 పెరిగింది. ఆదివారం ఉదయం క్వింటాకు రూ. 7,500, సాయంత్రం రూ. 7,600 పలికింది. ఇలా రెండు రోజులపాటు ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనపడగా మంగళవారం మాత్రం ఊహించని స్థాయికి చేరుకుంది. అటు సీడ్ ధరలు సైతం ఈసారి అనూహ్యంగా పెరిగాయి. క్వింటాలుకు రూ. 3,400 లభిస్తోంది. ఇది గతేడాది గరిష్ఠంగా రూ. 2,100 మాత్రమే పలికింది.

రికార్డు స్థాయిలో

వరంగల్ జిల్లా నెక్కొండలో మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా తెల్ల బంగారం(Cotton Price Hike) క్వింటాకు 8 వేల 350 రూపాయలు పలికింది. గత కొన్నేళ్లలో ఈ స్థాయి ధరలు చూడలేదని అధికారులు అంటున్నారు. గజ్వేల్​లో రూ. 8,261, జమ్మికుంట, నారాయణపేటలో రూ. 8,150, ఆదిలాబాద్​లో రూ. 8,020 దక్కింది. ఇక అత్యల్పంగా నారాయణఖేడ్​లో రూ. 6,025 పలికింది. నారాయణఖేడ్​లో దక్కిన ధర ఎంఎస్పీ(MSP)తో సమానంగా ఉంది.

రైతుల ఆశలు చిగురించే

ధరలు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా సాగుదారులు సైతం పంటను(Cotton Price Hike) వెంటనే విక్రయించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈసారి దిగుబడులు సగానికి సగం తగ్గినా చేతికందిన పంటయితే నాణ్యంగా ఉంది. ఆగస్టులో వర్షాల వల్ల చేలల్లో నీరు చేరి... పంట పనికిరాకుండా పోయింది. అటు పెట్టుబడులు, కౌలు ధరలు పెరగడంతో రైతన్నలు అప్పులు తెచ్చి పత్తిని కాపాడుకోవాల్సి వచ్చింది. అందిన అరకొర దిగుబడులకైనా ఇప్పుడు మంచి ధరలు చేతికి అందుతుండటంతో సాగుదారుల్లో ఉపశమనం కనిపిస్తోంది.

.

ఇదీ చదవండి: RATES ON MIDDLE CLASS: అటు ఇంధన ధరలు.. ఇటు నిత్యావసరాలు.. మధ్యలో సామాన్యుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.