ETV Bharat / state

కుందేళ్ల పెట్టెలోకి దూరిన 25 అడుగుల కొండచిలువ

author img

By

Published : Oct 16, 2020, 3:14 PM IST

కుందేళ్ల పెట్టెలోకి దూరి ఐదు కుందేళ్లను కొండచిలువ మింగేసిన ఘటన నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో జరిగింది.

nalgonda district news
కుందేళ్ల పెట్టెలోకి దూరిన 25 అడుగుల కొండచిలువ

నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో కొండచిలువ హల్​చల్​ చేసింది. స్థానిక బత్తాయి తోటలో ఓ రైతు కుందేళ్ల పెంపకం చేస్తున్నారు. ఆ కుందేళ్ల పెట్టెలోకి చొరబడ్డ 25 అడుగుల కొండచిలువ.. ఐదు కుందేళ్లను మింగేసింది.

విషయం తెలుసుకున్న రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వాళ్లు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. పామును సాగర్​ అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

నల్గొండ జిల్లా పెద్దపూర మండలం చలకుర్తి గ్రామంలో కొండచిలువ హల్​చల్​ చేసింది. స్థానిక బత్తాయి తోటలో ఓ రైతు కుందేళ్ల పెంపకం చేస్తున్నారు. ఆ కుందేళ్ల పెట్టెలోకి చొరబడ్డ 25 అడుగుల కొండచిలువ.. ఐదు కుందేళ్లను మింగేసింది.

విషయం తెలుసుకున్న రైతు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వాళ్లు వచ్చి కొండచిలువను పట్టుకున్నారు. పామును సాగర్​ అటవీప్రాంతంలో వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండిః బైక్​లో దూరి యజమానిని ముప్పతిప్పలు పెట్టిన పాము

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.