సీఎం కేసీఆర్ కృషితో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దండు మల్కాపురం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్లో దాదాపు 458 పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని...పట్టభద్రుల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వాటితో పాటు యాదాద్రి పవర్ ప్లాంట్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన తెలిపారు.
నల్గొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలంలో తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేసినట్లు... పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా తనకే పూర్తి మద్దతు ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు.
ఇదీ చదవండి: 'నిజమైన స్త్రీ విముక్తి కోసం ప్రజా యుద్ధంలో భాగమవుదాం'