ETV Bharat / state

నాంపల్లి హత్యకేసు నిందితులు రిమాండ్​కు తరలింపు - Nampally Murder case

భర్త మరణించాక.. ఆమెకు ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. హైదరాబాద్ వచ్చి వాళ్లిద్దరూ కొన్నాళ్లు సహజీవనం చేశారు. కొద్ది రోజులు వారిద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఆమె అనుమానాస్పద రీతిలో చనిపోయింది. తమ సోదరి చావుకు ప్రియుడే కారణమని భావించి అతనిపై కొబ్బరి బోండాల కత్తితో తల నరికి చంపారు. నిందితులను అదుపులోకి తీసకుని రిమాండ్​కు తరలించినట్లు జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

నాంపల్లి నిందితులను రిమాండ్​కు తరలింపు
author img

By

Published : Jul 21, 2019, 9:51 PM IST

నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌, నాంపల్లికి చెందిన ఎండీ గౌస్‌.. నేరెళ్ల గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడిని హత్య చేసి.. తలను శరీరం నుంచి వేరు చేశారు. తల తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. వీరికి సోదరి వరసయ్యే ఓ మహిళను సద్దాం చంపేశాడనే అనుమానంతోనే అతని హతమార్చారు.

అసలేం జరిగిందంటే...

ఇర్ఫాన్, గౌస్​కు సోదరి వరసయ్యే ఓ మహిళకు అంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్త చనిపోయాడు. ఆటో డ్రైవర్‌గా పని చేసే సద్దాం ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి సహజీవనం ప్రారంభించాడు. 2017లో ఆమె అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలింది. తమ సోదరి చనిపోవడానికి సద్దామే కారణమని ఇర్ఫాన్, గౌస్ బలంగా నమ్మారు.

పథకం ప్రకారమే హత్య

అదును కోసం వేచి చూసిన వీరిద్దరూ.. శనివారం సాయంత్రం నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి బోండాల కత్తితో సద్దాం తల నరికారు. తలతో పాటు నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి అక్కడ లొంగిపోయారు. ఈ ముగ్గురికి గతంలో మంచి స్నేహం ఉన్నట్లు సమాచారం. నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్​కు తరలించారు.

నాంపల్లి హత్య కేసు నిందితులకు రిమాండ్

ఇవీచూడండి: హత్య చేసి.. తలతో పోలీస్​ స్టేషన్​కు

నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌, నాంపల్లికి చెందిన ఎండీ గౌస్‌.. నేరెళ్ల గ్రామానికి చెందిన సద్దాం అనే యువకుడిని హత్య చేసి.. తలను శరీరం నుంచి వేరు చేశారు. తల తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. వీరికి సోదరి వరసయ్యే ఓ మహిళను సద్దాం చంపేశాడనే అనుమానంతోనే అతని హతమార్చారు.

అసలేం జరిగిందంటే...

ఇర్ఫాన్, గౌస్​కు సోదరి వరసయ్యే ఓ మహిళకు అంతకు ముందే వేరే వ్యక్తితో పెళ్లయ్యింది. కానీ భర్త చనిపోయాడు. ఆటో డ్రైవర్‌గా పని చేసే సద్దాం ఆమెకు దగ్గరయ్యాడు. అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి సహజీవనం ప్రారంభించాడు. 2017లో ఆమె అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలింది. తమ సోదరి చనిపోవడానికి సద్దామే కారణమని ఇర్ఫాన్, గౌస్ బలంగా నమ్మారు.

పథకం ప్రకారమే హత్య

అదును కోసం వేచి చూసిన వీరిద్దరూ.. శనివారం సాయంత్రం నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి బోండాల కత్తితో సద్దాం తల నరికారు. తలతో పాటు నేరుగా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి అక్కడ లొంగిపోయారు. ఈ ముగ్గురికి గతంలో మంచి స్నేహం ఉన్నట్లు సమాచారం. నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్​కు తరలించారు.

నాంపల్లి హత్య కేసు నిందితులకు రిమాండ్

ఇవీచూడండి: హత్య చేసి.. తలతో పోలీస్​ స్టేషన్​కు

Intro:వ్యక్తి దారుణ హత్య


నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో నిన్న జరిగిన సద్దాం (26)ను హత్య చేసిన హంతకులను మీడియా ముందు హాజరు పరచి రిమాండ్ కు తరలిస్తామని చెప్పిన నాంపల్లి పోలీసులు.
నాంపల్లి మండలం నేరళ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ కె సద్దాం(26)అనే వ్యక్తిని అనుముల మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన ఇర్ఫాన్ నాంపల్లి మండలం కు చెందిన ఎండి గౌస్ లు నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం సమీపంలో కొబ్బరి బొండాలు నరికే కొడవలితో దారుణంగా వేటకొడవలి తో చంపి తలను మొండెం ను వేరు చేసి తలను తమ ద్విచక్ర వాహనంపై స్థానిక పోలీస్ స్టేషన్ కు తీసుకొని లొంగిపోయారని ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. హంతకులు ఇద్దరి యొక్క సొంత పెద్దమ్మ కూతురు షేక్ రజియా అనుముల మండలం మారేపల్లి గ్రామం. ఇమే భర్త చనిపోడంతో ఆమెకు వరుసకు మరిది అయినా నాంపల్లి మండలం నేరాళ్లపల్లి కి చెందిన షేక్ సద్దాం రజియా తో వివేతర సంబంధం పెట్టుకొని హైదరాబాద్ లోనివాసం ఉండి కొద్దీ రోజులు వారు ఇద్దరు సహజీవనం చేసుకున్నారని అనంతరం ఆమె 2017 సంవత్సరం లో ఉరేసుకుని హాత్మ హత్య కు పాల్పడింది .ఈమె హత్మ హత్యకు కారణం ఈ ఇరువురు తమ సోదరి చావుకు కారణం ఎస్ కె సద్దాం అని అనుమానం తో అతనిపై గొడవ పడి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదు అయ్యింది ఈ కేసుకు సంబంధించి ఒప్పందం చనిపోయిన రజియా ఇద్దరు పిల్లలను తానే చూసుకొని వారు చదువులు పెళ్లిళ్లు నేనె చేస్తానని హామీ ఇచ్చి ఒప్పందం పై కొద్దిరోజులు చూసుకొని తర్వాత ఆ పిల్లలకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం తో అప్పటి నుండి కోపంతో రగిలి పోయిన గౌస్, మరియు ఇర్ఫాన్ లు సద్దాం పై కక్ష పెంచుకొని అదును కోసం వేచి చూశారు. ఇదే క్రమంలో నిన్న సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయం లో నాంపల్లి బస్ స్టాండ్ సమీపంలో చాయ్ కొట్టు వద్ద సద్దాం గౌస్ కు ఎదురు పడి భుజం తట్టడంతో ఏమిటని ప్రశ్నించడంతో నువ్వు నన్ను ఎం పికాలేవ్ అని గౌస్ కు బదులిచ్చారు కోపంతో రగిలిపోయిన గౌస్,ఇర్ఫాన్ లు తాము విడ్ని ఏదైనా చేయాలనే ఉద్దేశ్యం తో పక్కన ఉన్న మద్యం దుకాణంలో మందు తిసుకొని సద్దాం మిత్రుడు శివ ఇంటి సమీపంలో వెంబడించి అతనిని అనుకున్న ప్రకారం హంతం చేసి తలను తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారని ఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలిపారు.Body:మునుగోడు నియోజకవర్గం
నల్లగొండ జిల్లాConclusion:పరమేష్ బొల్లం
9966816056
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.