ETV Bharat / state

మారుతీ రావు డ్రైవర్​ను విచారించిన పోలీసులు - hyderabad crime news

మారుతీరావు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. చనిపోయిన రోజు మారుతీ రావు.. ఎవరెవరిని కలిశారో ఆరా తీస్తున్నారు. ఆయన చరవాణిని విశ్లేషించి... ఆయన ఎవరెవరితో మాట్లాడారో వాళ్లను పిలిపించి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు.

muruthi rao murder case
మారుతీ రావు డ్రైవర్​ను విచారించిన పోలీసులు
author img

By

Published : Mar 12, 2020, 11:43 PM IST

మారుతీ రావు మృతి కేసులో సైఫాబాద్ పోలీసులు.. ఇవాళ డ్రైవర్ రాజేశ్​ను ప్రశ్నించారు. మిర్యాలగూడ నుంచి సైఫాబాద్ పోలీస్ స్టేషన్​కు పిలిపించి అతని నుంచి పలు వివరాలు సేకరించారు. మిర్యాలగూడ నుంచి బయల్దేరే ముందు మారుతీరావు... ఓ పురుగుల మందు దుకాణం వద్ద కాసేపు ఆగినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఖాళీ సమాయాల్లోనూ మారుతీ రావు తరచూ అక్కడ కూర్చుండేవాడని వివరించాడు.

శనివారం సాయంత్రం ఆర్యవైశ్య భవన్​కు చేరుకున్న తర్వాత... రాత్రి బయటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నట్లు తెలిపాడు. గదిలోకి వెళ్లాక... గారెలు తెప్పించుకొని తిన్నట్లు డ్రైవర్ తెలిపాడు. తాను గదిలో పడుకుంటానని కోరినా... వాహనంలోనే పడుకోవాలని సూచించడంతో కిందికి వెళ్లినట్లు పోలీసులకు వివరించాడు.

ఉదయం మారుతీరావు భార్య... ఫోన్ కలవడంలేదని చెప్పడంతో... పైకి వెళ్లి చూసినా... గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చినట్లు డ్రైవర్.. పోలీసులకు వివరించారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బంది తలుపులు గట్టిగా నెట్టి... లోపలికి వెళ్లి చూడగా మారుతీరావు పరువుపై పడిపోయినట్లు గుర్తించామని తెలిపాడు. పోలీసులు డ్రైవర్ రాజేశ్ చరవాణిని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే భవవంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఇదీ చూడండి: నాన్న ఆస్తి నాకొద్దు.. అమ్మే నా దగ్గరికి రావాలి: అమృత

మారుతీ రావు మృతి కేసులో సైఫాబాద్ పోలీసులు.. ఇవాళ డ్రైవర్ రాజేశ్​ను ప్రశ్నించారు. మిర్యాలగూడ నుంచి సైఫాబాద్ పోలీస్ స్టేషన్​కు పిలిపించి అతని నుంచి పలు వివరాలు సేకరించారు. మిర్యాలగూడ నుంచి బయల్దేరే ముందు మారుతీరావు... ఓ పురుగుల మందు దుకాణం వద్ద కాసేపు ఆగినట్లు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. ఖాళీ సమాయాల్లోనూ మారుతీ రావు తరచూ అక్కడ కూర్చుండేవాడని వివరించాడు.

శనివారం సాయంత్రం ఆర్యవైశ్య భవన్​కు చేరుకున్న తర్వాత... రాత్రి బయటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నట్లు తెలిపాడు. గదిలోకి వెళ్లాక... గారెలు తెప్పించుకొని తిన్నట్లు డ్రైవర్ తెలిపాడు. తాను గదిలో పడుకుంటానని కోరినా... వాహనంలోనే పడుకోవాలని సూచించడంతో కిందికి వెళ్లినట్లు పోలీసులకు వివరించాడు.

ఉదయం మారుతీరావు భార్య... ఫోన్ కలవడంలేదని చెప్పడంతో... పైకి వెళ్లి చూసినా... గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చినట్లు డ్రైవర్.. పోలీసులకు వివరించారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బంది తలుపులు గట్టిగా నెట్టి... లోపలికి వెళ్లి చూడగా మారుతీరావు పరువుపై పడిపోయినట్లు గుర్తించామని తెలిపాడు. పోలీసులు డ్రైవర్ రాజేశ్ చరవాణిని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే భవవంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

ఇదీ చూడండి: నాన్న ఆస్తి నాకొద్దు.. అమ్మే నా దగ్గరికి రావాలి: అమృత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.