ETV Bharat / state

జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని

author img

By

Published : Apr 8, 2021, 2:03 PM IST

ఓటమి భయంతోనే కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి తెరాస నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ విమర్శించారు. సాగర్​ ఉప ఎన్నికలో ఆ పార్టీకి పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు.

minister thalasani
సాగర్​ ఎన్నికల ప్రచారంలో తలసాని

సాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. ఆ భయంతోనే తెరాస నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జానారెడ్డి గత 35 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని తలసాని విమర్శించారు. వారిని చైతన్యం చేయడానికే తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉత్తమ్​కుమార్ రెడ్డి ఎంపీ నిధులు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు సాగర్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు.

సాగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. ఆ భయంతోనే తెరాస నాయకులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జానారెడ్డి గత 35 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని తలసాని విమర్శించారు. వారిని చైతన్యం చేయడానికే తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో ఉత్తమ్​కుమార్ రెడ్డి ఎంపీ నిధులు ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు సాగర్ ఉప ఎన్నికలో పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ఫ్లైఓవర్​ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.