ETV Bharat / state

పంటల నష్టం గురించి సీఎం ఆదేశించారు: గుత్తా

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్​తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటల గురించి సీఎం కేసీఆర్​ వివరాలు సేకరించాలని అధికారులకు తెలిపారని అన్నారు.

author img

By

Published : Oct 18, 2020, 5:06 AM IST

Legislative Council Chairman Gutha Sukender Reddy visit devarakonda nalgonda district
పంటల నష్టం గురించి సీఎం ఆదేశించారు: గుత్తా

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్​తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో గ్రంథాలయం, మినీ బ​స్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మున్సిపాలిటీ కార్యాలయం భవన ప్రారంభోత్సవం చేశారు.

Legislative Council Chairman Gutha Sukender Reddy visit devarakonda nalgonda district
మున్సిపాలిటీ కార్యాలయం భవన ప్రారంభోత్సవం

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లిందని గుత్తా అన్నారు. వరి, పత్తి పంటల నష్టాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు వివరాలు సేకరించాలని ఆదేశించారని తెలిపారు.

దేవరకొండ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోజురోజుకీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బస్టాండ్ వెనుక స్థలంలో మినీ బస్టాండ్​ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి : ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్​తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో గ్రంథాలయం, మినీ బ​స్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మున్సిపాలిటీ కార్యాలయం భవన ప్రారంభోత్సవం చేశారు.

Legislative Council Chairman Gutha Sukender Reddy visit devarakonda nalgonda district
మున్సిపాలిటీ కార్యాలయం భవన ప్రారంభోత్సవం

రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లిందని గుత్తా అన్నారు. వరి, పత్తి పంటల నష్టాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు వివరాలు సేకరించాలని ఆదేశించారని తెలిపారు.

దేవరకొండ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోజురోజుకీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బస్టాండ్ వెనుక స్థలంలో మినీ బస్టాండ్​ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి : ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.