ETV Bharat / state

అనుమానం పెనుభూతమైంది.. చివరకు ఏం జరిగిందంటే..

author img

By

Published : Apr 9, 2023, 7:00 PM IST

Extra marital affair murder case in Nalgonda: ఓ యువకుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు స్థానికి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతకి ఆ యువకుడు బతికి ఉన్నాడా? చనిపోయాడా? ఈ ఘటన ఏక్కడ జరిగింది? ఆ భార్యాభర్తలు ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే..!

Shankar
శంకర్

Extra marital affair murder case in Nalgonda: సంతోషంగా గడుపుతున్న జీవితాల్లోకి అనుమానం అనే చీడ పురుగు ప్రవేశిస్తే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. చీడపురుగు ఎలా అయితే మంచిగా ఉన్న చెట్లును చెద పెట్టి నాశనం చేస్తుందో అలానే మనిషి మనసులో అనుమానం అనే భావన ఏర్పడితే మన సంతోషంతో పాటు చుట్టు పక్కల ఉన్నవారి ఆనందాన్ని కూడా నాశనం చేస్తుంది. చీడ పురుగు పట్టిన తరవాత చెట్టుకి మిగిలేది చెద మాత్రమే అలానే మనిషికి చివరికి మిగిలేది అంధకారమైన జీవితం. అనుమానంతో ఉన్న కొంత మంది వ్యక్తులు ఎలాంటి దారుణాలు చేయడానికైనా వెనకాడరు. ఈ విధంగానే ఓ వ్యక్తి తన భార్య వేరే యువకుడితో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీన్ని తట్టుకోలేక కోపంతో ఆ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. చివరికి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో జరిగింది.

ఎస్​ఐ ప్రవీణ్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన పాపకంటి మసూద్​ అలియాస్​ మధు(35) తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అదే గ్రామానికి చెందిన శిర్రబోయిన శంకర్​(27) తన భార్యతో గత కొంత కాలంగా చనువుగా ప్రవర్తించడం గమనించాడు. దీంతో శంకర్​ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అని మరింత అనుమానం పెంచుకున్నాడు. అనంతరం శనివారం మధ్యాహ్నాం సమయంలో శంకర్​తో గొడవ పడ్డాడు. ఈ గొడవలో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. చుట్టు పక్కల ఉన్న స్థానికులు ఆపడానికి ఎంత ప్రయత్నించిన మధుని అదుపులోకి తీసుకొచ్చేందుకు విఫలం చెందారు. ఈ సమయంలోనే ఆ యువకుడిపై కత్తితో తీవ్రంగా గాయపరిచాడు.

ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున శంకర్​ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుని కుటుంబం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ ప్రవీణ్​ కుమార్​ వెల్లడించారు.

ఇవీ చదవండి:

Extra marital affair murder case in Nalgonda: సంతోషంగా గడుపుతున్న జీవితాల్లోకి అనుమానం అనే చీడ పురుగు ప్రవేశిస్తే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి. చీడపురుగు ఎలా అయితే మంచిగా ఉన్న చెట్లును చెద పెట్టి నాశనం చేస్తుందో అలానే మనిషి మనసులో అనుమానం అనే భావన ఏర్పడితే మన సంతోషంతో పాటు చుట్టు పక్కల ఉన్నవారి ఆనందాన్ని కూడా నాశనం చేస్తుంది. చీడ పురుగు పట్టిన తరవాత చెట్టుకి మిగిలేది చెద మాత్రమే అలానే మనిషికి చివరికి మిగిలేది అంధకారమైన జీవితం. అనుమానంతో ఉన్న కొంత మంది వ్యక్తులు ఎలాంటి దారుణాలు చేయడానికైనా వెనకాడరు. ఈ విధంగానే ఓ వ్యక్తి తన భార్య వేరే యువకుడితో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. దీన్ని తట్టుకోలేక కోపంతో ఆ యువకుడిపై కత్తితో దాడి చేశాడు. చివరికి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం స్థానికులు ద్వారా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలంలో జరిగింది.

ఎస్​ఐ ప్రవీణ్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం సర్వారం గ్రామానికి చెందిన పాపకంటి మసూద్​ అలియాస్​ మధు(35) తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. అదే గ్రామానికి చెందిన శిర్రబోయిన శంకర్​(27) తన భార్యతో గత కొంత కాలంగా చనువుగా ప్రవర్తించడం గమనించాడు. దీంతో శంకర్​ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అని మరింత అనుమానం పెంచుకున్నాడు. అనంతరం శనివారం మధ్యాహ్నాం సమయంలో శంకర్​తో గొడవ పడ్డాడు. ఈ గొడవలో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. చుట్టు పక్కల ఉన్న స్థానికులు ఆపడానికి ఎంత ప్రయత్నించిన మధుని అదుపులోకి తీసుకొచ్చేందుకు విఫలం చెందారు. ఈ సమయంలోనే ఆ యువకుడిపై కత్తితో తీవ్రంగా గాయపరిచాడు.

ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున శంకర్​ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధితుని కుటుంబం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ ప్రవీణ్​ కుమార్​ వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.