నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాజెక్టులో ఓ మత్స్యకారుడి వలకు భారీ చేప చిక్కింది. గౌరారానికి చెందిన ఆళ్వాల వెంకన్న చేపలు పట్టేందుకు రోజువారీగా చెరువులో వల వేశాడు. ఉదయం వలను తీస్తున్న క్రమంలో బరువుగా అనిపించింది.
దాంతో ఒక్కసారిగా లాగడంతో ఆ వలలో పెద్ద చేప చిక్కిందని చిక్కింది. మొత్తం 4 అడుగుల పొడవు, 11 కిలోల బరువుతో చేప లభ్యమైంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద చేప లభించడంతో స్థానికులు దాన్ని ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చదవండి: వినూత్నంగా ఆలోచించారు.. విద్యార్థుల మనసు దోచుకున్నారు.!