ETV Bharat / state

Gutha Sukender Reddy Chit Chat : 'వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను.. అవకాశమిస్తే..'

author img

By

Published : Jun 23, 2023, 7:20 PM IST

Gutha on Telangana Assembly Elections 2023 : రాజకీయంగా వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్లు పదవీ కాలం ఉందన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్​ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.

Gutha Sukenderreddy
Gutha Sukenderreddy

Gutha Sukender Reddy on TS Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ఒకవైపు ఈసారి కేసీఆర్​ను గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రతిపక్షాలు బల్ల గుద్ది చెబుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు మూడోసారి తమ సర్కారే అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్​ఎస్​దేనని జోస్యం చెప్పారు.

Gutha Sukender Comments on Congress : ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్లు పదవీ కాలం ఉందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పని చేస్తామని.. వారసులకు పదవుల కోసం పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు. వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని గుత్తా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్​లో చేరే అవకాశం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బీఆర్​ఎస్ నుంచి ఇతర పార్టీలకు ఎవరూ వెళ్లే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్​ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.

అందుకే సీఎం పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు బీఆర్​ఎస్​వేనని గుత్తా సుఖేందర్​ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్​లో చేరతామంటున్న ఖమ్మం, మహబూబ్​నగర్ జిల్లా నేతలు.. ఎక్కువగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బీఆర్​ఎస్​కు 2018 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని గుత్తా అన్నారు. కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని.. అందుకే పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి అన్యాయమే చేసింది తప్ప.. ఒక్క న్యాయం చేయలేదని సుఖేందర్​రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. బీఆర్​ఎస్ లౌకిక పార్టీ అని.. బీజేపీతో కలిసి పని చేయదన్నారు. ఏపీ, తెలంగాణ భూముల ధరలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనే తాము ప్రస్తావిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి :

Gutha Sukender Reddy on TS Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదంటే మాదంటూ ప్రధాన పార్టీల నేతలు ఒకటే పాట పాడుతున్నారు. ఒకవైపు ఈసారి కేసీఆర్​ను గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రతిపక్షాలు బల్ల గుద్ది చెబుతుండగా.. మరోవైపు అధికార పార్టీ నేతలు మూడోసారి తమ సర్కారే అధికారం చేజిక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తన ఛాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... రాబోయే ఎన్నికల్లో గెలుపు బీఆర్​ఎస్​దేనని జోస్యం చెప్పారు.

Gutha Sukender Comments on Congress : ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్లు పదవీ కాలం ఉందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పని చేస్తామని.. వారసులకు పదవుల కోసం పార్టీలు మారాల్సిన అవసరం లేదన్నారు. వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని గుత్తా అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్​లో చేరే అవకాశం ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో బీఆర్​ఎస్ నుంచి ఇతర పార్టీలకు ఎవరూ వెళ్లే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్​ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని గుత్తా ధీమా వ్యక్తం చేశారు.

అందుకే సీఎం పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు బీఆర్​ఎస్​వేనని గుత్తా సుఖేందర్​ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్​లో చేరతామంటున్న ఖమ్మం, మహబూబ్​నగర్ జిల్లా నేతలు.. ఎక్కువగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బీఆర్​ఎస్​కు 2018 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని గుత్తా అన్నారు. కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని.. అందుకే పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి అన్యాయమే చేసింది తప్ప.. ఒక్క న్యాయం చేయలేదని సుఖేందర్​రెడ్డి ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. బీఆర్​ఎస్ లౌకిక పార్టీ అని.. బీజేపీతో కలిసి పని చేయదన్నారు. ఏపీ, తెలంగాణ భూముల ధరలపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలనే తాము ప్రస్తావిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.