ETV Bharat / state

న్యాయం కోసం ప్రగతిభవన్‌కు చేరిన కుటుంబం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు - A tribal family went to Pragati Bhavan

Tribal Family at Pragathi Bhavan: న్యాయం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతిభవన్‌కు వచ్చిన గిరిజన కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది తమ కుమారుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై పునర్విచారణ జరిపించాలని సీఎం కేసీఆర్‌ను కోరేందుకు వచ్చినట్లు ఆ దంపతులు తెలిపారు. సీఎంకు తమ గోడు చెప్పుకొందామని వస్తే పోలీసులు ఠాణాకు తరలించారని వాపోయారు.

tribal family at pragathi bhavan
ప్రగతిభవన్​కు వచ్చిన గిరిజన కుటుంబం
author img

By

Published : Apr 30, 2022, 2:04 PM IST

Tribal Family at Pragathi Bhavan: కుమారుడి హత్య విషయంలో నేరస్థులకు శిక్ష పడేలా తమకు న్యాయం చేయాలంటూ.... ఓ గిరిజన కుటుంబం ప్రగతిభవన్‌కు వెళ్లింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు శివరామ్​ గతేడాది చనిపోయాడు. కొంతమంది తమ బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు.

న్యాయం కోసం ప్రగతిభవన్‌కు చేరిన కుటుంబం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

"గతేడాది మా కుమారుడు చనిపోయాడు. ఎవరో హత్య చేశారు. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మేమేం కొట్లాడటానికి ప్రగతిభవన్​కు రాలేదు. న్యాయం కోసమే సీఎం కేసీఆర్​ను కలవడానికి వచ్చాం. దయచేసి ఇప్పటికైనా పోలీసులు మా గోడు వినిపించుకోవాలి." -బాధిత కుటుంబం

ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకునేందుకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. పంజాగుట్ట పోలీసు స్టేషన్​కు తరలించారు. గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే... పోలీసులు తమను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారని దంపతులు వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి: 15 రోజులు గడిచాయ్.. మీ యాక్షన్ ఏదీ?.. కేసీఆర్​కు బండి లేఖ

న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

Tribal Family at Pragathi Bhavan: కుమారుడి హత్య విషయంలో నేరస్థులకు శిక్ష పడేలా తమకు న్యాయం చేయాలంటూ.... ఓ గిరిజన కుటుంబం ప్రగతిభవన్‌కు వెళ్లింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన రాము, లక్ష్మి దంపతుల కుమారుడు శివరామ్​ గతేడాది చనిపోయాడు. కొంతమంది తమ బిడ్డను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 8 నెలలుగా తిరుగుతున్నా పోలీసులు తమను పట్టించుకోవడం లేదంటూ బాధితులు ఆరోపించారు.

న్యాయం కోసం ప్రగతిభవన్‌కు చేరిన కుటుంబం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

"గతేడాది మా కుమారుడు చనిపోయాడు. ఎవరో హత్య చేశారు. పోలీసులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మేమేం కొట్లాడటానికి ప్రగతిభవన్​కు రాలేదు. న్యాయం కోసమే సీఎం కేసీఆర్​ను కలవడానికి వచ్చాం. దయచేసి ఇప్పటికైనా పోలీసులు మా గోడు వినిపించుకోవాలి." -బాధిత కుటుంబం

ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకునేందుకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వారిని అడ్డుకున్న పోలీసులు.. పంజాగుట్ట పోలీసు స్టేషన్​కు తరలించారు. గోడు వెళ్లబోసుకునేందుకు వస్తే... పోలీసులు తమను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారని దంపతులు వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు న్యాయం చేయాలని కోరారు.

ఇవీ చదవండి: 15 రోజులు గడిచాయ్.. మీ యాక్షన్ ఏదీ?.. కేసీఆర్​కు బండి లేఖ

న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను గుర్తుంచుకోవాలి: జస్టిస్ రమణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.