నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంబేద్కర్ చౌరస్తాలో వంటావార్పు చేస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్షం నేతలు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ డ్రైవర్ను చితకబాదిన కూకట్పల్లి వాసులు