ETV Bharat / state

పెళ్లింట్లో దొంగతనం... సుమారు 4లక్షల చోరీ...

author img

By

Published : Nov 12, 2019, 9:45 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో దొంగతనం జరిగింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి ఏడున్నర తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో దొంగలు హల్​చల్​

నాగర్​కర్నూల్​ పట్టణంలో దొంగలు హల్​చల్​ చేశారు. హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో తాళం వేసున్న ఓ ఇంటిని కొల్లగొట్టారు. ఏడున్నర తులాల బంగారం, 25తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. వారం కిందట ఇంట్లో పెళ్లి జరిగింది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి అందరూ ఊరెళ్లారు. ఇవాళ ఉదయం లైటింగ్​ తీయడానికొచ్చిన వాళ్లు తాళం విరిగిపోయి ఉండడం చూసి యజమానికి సమాచారం అందించారు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఇన్​ఛార్జి ఎస్పీ అపూర్వ రావు, డీఎస్పీ మోహన్​ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్​టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో దొంగలు హల్​చల్​

ఇదీ చూడండి: ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు

నాగర్​కర్నూల్​ పట్టణంలో దొంగలు హల్​చల్​ చేశారు. హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో తాళం వేసున్న ఓ ఇంటిని కొల్లగొట్టారు. ఏడున్నర తులాల బంగారం, 25తులాల వెండి, రూ.80వేల నగదు దోచుకెళ్లారని బాధితులు వాపోతున్నారు. వారం కిందట ఇంట్లో పెళ్లి జరిగింది. నిన్న సాయంత్రం ఇంటికి తాళం వేసి అందరూ ఊరెళ్లారు. ఇవాళ ఉదయం లైటింగ్​ తీయడానికొచ్చిన వాళ్లు తాళం విరిగిపోయి ఉండడం చూసి యజమానికి సమాచారం అందించారు. బాధితులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఇన్​ఛార్జి ఎస్పీ అపూర్వ రావు, డీఎస్పీ మోహన్​ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. క్లూస్​టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలో దొంగలు హల్​చల్​

ఇదీ చూడండి: ఓవైసీ ఆస్పత్రికి గుమస్తా చంద్రయ్య తరలింపు

Intro:TG_MBNR_8_12_THALAM_VESINA_INTLO_CHORI_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగింది.పట్టణం లోని హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలోని ఇంట్లో పెళ్లి జరిగి వారం రోజులు అవుతుంది.ఇంతలో తాళం వేసి నిన్న రాత్రి ఊరికి వెళ్లారు.తాళం వేసిన ఇంటి పై కన్ను వేసిన దొంగలు... ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఏడున్నర తులాల బంగారం, 25 తులాల వెండి,80 వేల నగదు ఎత్తుకెళ్లి నట్లు ఇంటి యజమానులు చెబుతున్నారు. ఈ ఉదయం పెండ్లికి వేసిన లైట్స్ విప్పడానికి వచ్చిన డెకరేషన్ వాళ్లు తాళం విరిగి డోరు తెరిచి కనిపించడంతో ఇంటి యజమానికి ఫోన్ చేశారు. వెంటనే ఊరు నుంచి వచ్చినా యజమానులు ఇంట్లో పోయిన వాటి గురించి పోలీసులకు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న నాగర్ కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ అపూర్వ రావు, డిఎస్పీ మోహన్ రెడ్డి పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో ఆధారాలను సేకరిస్తున్నారు.ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా నాగర్కర్నూల్ పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ...దీంతో నగరవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు....AVB
BYTE:- డిఎస్పి మోహన్ రెడ్డి, ఇంటి యజమాని విజయ్.


Body:TG_MBNR_8_12_THALAM_VESINA_INTLO_CHORI_AVB_TS10050


Conclusion:TG_MBNR_8_12_THALAM_VESINA_INTLO_CHORI_AVB_TS10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.