ETV Bharat / state

నల్లమలను వల్లకాడు చేస్తారా?: రేవంత్​రెడ్డి

నల్లమల ప్రాంతం అపారమైన నిధులు, నిక్షేపాలకు అడ్డా. వీటిపైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కన్నుపడి.. ఇక్కడ యురేనియం తవ్వడానికి కుట్రలు, కుయుక్తులతో ముందుకు వస్తున్నారు. అమాయకమైన చెంచులను మభ్యపెడుతున్నారు. ------ రేవంత్​రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ

author img

By

Published : Aug 18, 2019, 9:11 PM IST

నల్లమల

నల్లమల అడవిని వల్లకాడును చేసి... ఇక్కడ బతికే చెంచులను దిక్కుమాలిన వారిని చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. నాగర్​కర్నూల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లాపూర్, వటవర్లపల్లిలో ఆయన పర్యటించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని రేవంత్ అన్నారు. చెంచులతో మాట్లాడి వారి జీవన శైలి, సమస్యల గురించి తెలుసుకున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమలను నాశనం చేయడానికి పూనుకున్నాయని ఆరోపించారు. యురేనియం తవ్వితే నీళ్లు కలుషితమవుతాయని... అటవీ సంపద నాశనమవుతుందన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో హరితహారం చేపట్టిందని.. అలాంటపుడు వందల ఏళ్లనాటి నల్లమల అడవిని ఎలా నాశనం చేస్తుందో వివరించాలన్నారు. ప్రజలందరూ.. ఏకమై ఇలాంటి దుశ్చర్యను ఆపడానికి సంసిద్ధం కావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

నల్లమల అడవిని వల్లకాడును చేసి... ఇక్కడ బతికే చెంచులను దిక్కుమాలిన వారిని చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. నాగర్​కర్నూల్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లాపూర్, వటవర్లపల్లిలో ఆయన పర్యటించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పార్లమెంట్​లో ప్రస్తావిస్తానని రేవంత్ అన్నారు. చెంచులతో మాట్లాడి వారి జీవన శైలి, సమస్యల గురించి తెలుసుకున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమలను నాశనం చేయడానికి పూనుకున్నాయని ఆరోపించారు. యురేనియం తవ్వితే నీళ్లు కలుషితమవుతాయని... అటవీ సంపద నాశనమవుతుందన్నారు. ప్రభుత్వం వందల కోట్ల రూపాయలతో హరితహారం చేపట్టిందని.. అలాంటపుడు వందల ఏళ్లనాటి నల్లమల అడవిని ఎలా నాశనం చేస్తుందో వివరించాలన్నారు. ప్రజలందరూ.. ఏకమై ఇలాంటి దుశ్చర్యను ఆపడానికి సంసిద్ధం కావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.

నల్లమలలో రేవంత్ పర్యటన

ఇవీ చూడండి: తండ్రీకొడుకుల పార్టీకి స్వస్తి పలికితేనే అభివృద్ధి

Intro:TG_MBNR_9_18_REVANTHREDDY_TOUR_AVB_TS10050
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMMAD ZAKEER HUSSAIN
CELLNO:-9885989452
( ) నల్లమలలోని యురేనియం తవ్వకాల కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రస్తావిస్తాం...అని ఇలాంటి దుశ్చర్య కు పాల్పడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎండగడతామని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజం ఎత్తాడు. నాగర్ కర్నూల్ జిల్లా లోని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు నల్లమలలోని మల్లాపూర్, వటవర్లపల్లి లో పర్యటించారు. చెంచులతో మాట్లాడి వారి జీవన శైలిని గురించి తెలుసుకున్నారు.చెంచు పెంటలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. చెంచుల గుడారాలలో వెళ్లి పరిశీలించారు. వారు నిత్యం తాగే చెలిమల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా చెంచులు ఎంపీ తో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడతామని ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నామని ఇక్కడే బతుకుతానని చెంచులు అందరం ఐక్యమత్యంతో యురేనియం తవ్వకాలు వ్యతిరేకంగా పోరాడతామని తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఎంపీ తో అన్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అడవిని నాశనం చేయడానికి పూనుకున్నారని ఇక్కడ ఉన్న ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. యురేనియం తవ్వితే నీళ్లు కలుషితమవుతాయి అని...అటవీ నాశనమవుతుందని చెంచు జాతి అంతరించి పోతుందని...జంతువుల మనుగడ మాయమవుతుంది అని ఆయన అన్నారు.ప్రభుత్వం ఎన్నో కోట్లతో రాష్ట్రం పచ్చగా ఉండడానికి హరితహారం కార్యక్రమం చేస్తుందని అలాంటి ప్రభుత్వం వందల ఏళ్లనాటి నల్లమల అడవి ని ఎలా నాశనం చేస్తుందో వివరించాలన్నారు. ప్రజలందరి ఏకమై ఇలాంటి దుశ్చర్యను ఆపడానికి సంసిద్ధం కావాలని ఆయన పేర్కొన్నారు....AVB
byte:- ఎంపీ రేవంత్ రెడ్డి


Body:TG_MBNR_9_18_REVANTHREDDY_TOUR_AVB_TS10050


Conclusion:TG_MBNR_9_18_REVANTHREDDY_TOUR_AVB_TS10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.