ETV Bharat / state

'గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి'

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రెండు గ్రామాలను పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకులు కృష్ణయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

author img

By

Published : Nov 4, 2020, 9:28 PM IST

Palle pragathi observer visits nagarkurnool dist
'గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి'

గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకులు కృష్ణయ్య అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని జిల్లెల, వేపూర్ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి సంరక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్​యార్డుల్లో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. గ్రామాల సర్పంచులకు, యువజన సంఘాల సభ్యులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు జంగయ్య, మాధవి, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ శోభా, గ్రామ కార్యదర్శులు తిరుపతయ్య, ఇందిర, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సన్నరకం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకులు కృష్ణయ్య అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని జిల్లెల, వేపూర్ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి సంరక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్​యార్డుల్లో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. గ్రామాల సర్పంచులకు, యువజన సంఘాల సభ్యులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు జంగయ్య, మాధవి, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ శోభా, గ్రామ కార్యదర్శులు తిరుపతయ్య, ఇందిర, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సన్నరకం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.