ETV Bharat / state

వైద్యం వికటించి యువకుడి మృతి... బంధువుల ఆందోళన

ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వలన వైద్యం వికటించి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. సాయిబాబా మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బంధువులు మృతదేహంలో అస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

author img

By

Published : Oct 13, 2019, 3:32 PM IST

వైద్యం వికటించి యువకుడి మృతి... బంధువుల ఆందోళన

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ లైలి ఆయుష్మాన్ ఫామిలీ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్​ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాచారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సాయిబాబాకు జ్వరం రావడం వల్ల దసరా రోజును ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు హై డోస్ మెడిసిన్స్, ఇంజక్షన్లు ఇవ్వడం సాయిబాబా పరిస్థితి విషమించింది. విషయం అర్థమైన వైద్యుడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు పంపించాడు. కిడ్నీపై తీవ్రమైన ప్రభావం పడి సాయిబాబా అక్కడే మృతి చెందాడు. మృతిదేహాన్ని ఆస్పత్రి ఎదుటే ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొంత సేపు అక్కడ ఉద్రికత పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిని సీజ్ చేసి... వైద్యుడు విష్ణు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని బందువులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని ఆస్పత్రిని సీజే చేసి, సాయిబాబా మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.

వైద్యం వికటించి యువకుడి మృతి... బంధువుల ఆందోళన

ఇవీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో శ్రీ లైలి ఆయుష్మాన్ ఫామిలీ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్​ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాచారం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి సాయిబాబాకు జ్వరం రావడం వల్ల దసరా రోజును ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు హై డోస్ మెడిసిన్స్, ఇంజక్షన్లు ఇవ్వడం సాయిబాబా పరిస్థితి విషమించింది. విషయం అర్థమైన వైద్యుడు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​కు పంపించాడు. కిడ్నీపై తీవ్రమైన ప్రభావం పడి సాయిబాబా అక్కడే మృతి చెందాడు. మృతిదేహాన్ని ఆస్పత్రి ఎదుటే ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కొంత సేపు అక్కడ ఉద్రికత పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిని సీజ్ చేసి... వైద్యుడు విష్ణు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని బందువులు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకొని ఆస్పత్రిని సీజే చేసి, సాయిబాబా మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.

వైద్యం వికటించి యువకుడి మృతి... బంధువుల ఆందోళన

ఇవీ చూడండి: చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

TG_HYD_24_13_RTC_NOTIFICATION_AV_3182388 reporter : sripathi.srinivas నోట్ ఆర్టీసీ బస్ భవన్, డ్రైవర్, కండక్టర్లు, మెకానిక్ లు, ఆర్టీసీ బస్సుల ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) టీఎస్ ఆర్టీసీలో బస్సులు నడపడానికి అర్హత కల్గిన డ్రైవర్, కండక్టర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం తాత్కాలిక డ్రైవర్ అభ్యర్థులకు రోజుకు రూ.1,500, కండక్టర్ అభ్యర్థులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున పారితోషకం సంస్థ అందిస్తోందని అధికారులు తెలిపారు. ఇంకా అదనంగా డ్రైవర్, కండక్టర్లను తీసుకోవడానికి అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రోజువారి పారితోషక పద్దతిన పదవీవిరమణ పొందిన ట్రాఫిక్, మెకానికల్, సూపర్ వైజర్స్ కు రూ.1,500లు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. మెకానిక్స్, శ్రామిక్స్, ఎలక్ట్రిషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్ సిబ్బందితో పాటు ఇతర విభాగాలకు చెందిన పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. ఓల్వో, ఏసీ, మల్టి యాక్సిల్స్ పై అనుభవం ఉన్న డ్రైవర్స్, మెకానిక్స్ లకు రోజుకు రూ.2వేల చొప్పున, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కు రోజుకు రూ.1,500లు, ఇతర శాఖలలో మెకానిక్స్ గా పనిచేసిన అనుభవం ఉన్నవారికి, రవాణాకు సంబంధించిన అనుభవం ఉన్న వారికి రోజుకు రూ.వెయ్యి చొప్పున వేతనం ఇవ్వనున్నారు. సాఫ్ట్ వేర్ నిపుణులకు ఐటీ ట్రైనర్ గా రోజుకు రూ.1,500ల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్లు, జిల్లా రవాణా అధికారులను సంప్రదించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.