ETV Bharat / state

ఆస్పత్రి సిబ్బంది దుమ్ముదులిపిన ఎమ్మెల్యే

కట్టు కట్టే పద్ధతి ఇదేనా..? జిల్లా ఆస్పత్రికి వస్తే రోగులకు ఇలా చికిత్స చేస్తారా..? పేద ప్రజలంటే ఇంత నిర్లక్ష్యమా..! అంటూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించడానికి నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడి సిబ్బంది తీరు కోపం తెప్పించింది.

author img

By

Published : Feb 14, 2020, 9:22 PM IST

mla
మర్రి జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిజినపల్లి మండలం లట్టుపల్లికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు భార్య , పిల్లలతో కలిసి బిజినేపల్లి నుంచి లట్టుపల్లికి బైక్​పై వెళ్తుండగా మంగనూర్ వద్ద విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టారు. భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య, పిల్లల్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే గాయపడ్డ వారిని పరామర్శించేందుకు జిల్లా ఆస్పత్రికి వచ్చారు. క్షతగాత్రుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలై 2 గంటలు అయినా వారికి ఎలాంటి చికిత్స చేయకపోవడంపై కోపగించారు.

భర్త చనిపోయి, తీవ్ర గాయాలై తీవ్ర మనోవేదనలో ఉన్న భార్యకు ఎక్స్ రే కూడా తీయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆర్థోపెడిక్ డాక్టర్, ఎక్స్​రే టెక్నీషియన్ సరైన సమయంలో స్పందించక పోతే ఎలా అన్నారు. భోజన విరామం నుంచి వచ్చిన సూపరింటెండెంట్​ను ఈ ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

మర్రి జనార్దన్ రెడ్డి

ఇవీ చూడండి:మంత్రి గారి చేతి కడియం కొట్టేశారు!

నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిజినపల్లి మండలం లట్టుపల్లికి చెందిన శ్రీనివాసులు అనే యువకుడు భార్య , పిల్లలతో కలిసి బిజినేపల్లి నుంచి లట్టుపల్లికి బైక్​పై వెళ్తుండగా మంగనూర్ వద్ద విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టారు. భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య, పిల్లల్ని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే గాయపడ్డ వారిని పరామర్శించేందుకు జిల్లా ఆస్పత్రికి వచ్చారు. క్షతగాత్రుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలై 2 గంటలు అయినా వారికి ఎలాంటి చికిత్స చేయకపోవడంపై కోపగించారు.

భర్త చనిపోయి, తీవ్ర గాయాలై తీవ్ర మనోవేదనలో ఉన్న భార్యకు ఎక్స్ రే కూడా తీయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆర్థోపెడిక్ డాక్టర్, ఎక్స్​రే టెక్నీషియన్ సరైన సమయంలో స్పందించక పోతే ఎలా అన్నారు. భోజన విరామం నుంచి వచ్చిన సూపరింటెండెంట్​ను ఈ ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

మర్రి జనార్దన్ రెడ్డి

ఇవీ చూడండి:మంత్రి గారి చేతి కడియం కొట్టేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.