కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలు ఇంటిని వదిలి బయటకు రావొద్దని.. వ్యక్తికి వ్యక్తికి మధ్య భౌతిక దూరం పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలను క్వారంటైన్ కేంద్రంగా సిద్ధం చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ మను చౌదరితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
క్వారంటైన్లో ఉన్న వారిని 24 గంటల పాటు పర్యవేక్షించేందుకు ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించకుండా బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా క్వారంటైన్ కేంద్రం వద్ద సేవలందించే అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం పట్టణంలోని ఓ వ్యక్తికి కరోనా వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలో ప్రజలెవరినీ బయటికి రానివ్వొద్దని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి : 'ఎంపీ ల్యాడ్స్ నిధుల రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి'