ETV Bharat / state

కొలువుదీరిన పాలక వర్గాలు... బాధ్యతలు చేపట్టిన ఛైర్మన్​, వైస్​ ఛైర్మన్లు

పూర్వ మహబూబ్​నగర్ జిల్లాలోని మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల... నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట... మున్సిపాలిటీల్లో పాలక వర్గాల ప్రమాణ స్వీకారం సహా ఛైర్మన్, వైస్ ఛైర్మన్​ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జడ్చర్ల మున్సిపల్ ఛైర్ పర్సన్​గా లక్ష్మి, వైస్ ఛైర్ పర్సన్​గా సారిక, అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్​గా ఎడ్ల నర్సింహా గౌడ్, వైస్ ఛైర్మన్​గా శైలజా రెడ్డి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ దాఖలవ్వడం వల్ల వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కొవిడ్​ కారణంగా అచ్చంపేటలో నలుగురు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. వారితో డిజిటల్ విధానంలో ప్రమాణ స్వీకారం చేయించారు.

author img

By

Published : May 7, 2021, 5:26 PM IST

achampet municipality
achampet municipality

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, పాలక వర్గాల ప్రమాణ స్వీకారం సహా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అచ్చంపేట పురపాలిక పాలకవర్గం ప్రమాణ స్వీకారం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా తెరాస నుంచి గెలిచిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తొలుత కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్ వల్ల హాజరుకాని మూడు, ఆరు, 18, 13 వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వారిచేత డిజిటల్ విధానం ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం ఛైర్మన్, వైస్​ఛైర్మన్​ల ఎన్నిక జరిగింది. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులుండగా తెరాస 13, కాంగ్రెస్-6 భాజపా-1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఛైర్మన్ పదవి తెరాసకు దక్కింది. ఈ పదవి జనరల్​కు రిజర్వ్ కాగా 16వవార్డు నుంచి గెలిచిన ఎడ్ల నర్సింహ గౌడ్​ ఛైర్మన్​గా, 19వ వార్డు నుంచి గెలుపొందిన శైలజారెడ్డిని వైస్​ ఛైర్మన్​గా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే కౌన్సిలర్లతో సమావేశమైన మంత్రి నిరంజన్ రెడ్డి అధిష్ఠానం సూచన మేరకే వీరిద్దరినీ ఎంపిక చేశామని వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్ పర్సన్లకు గువ్వల బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేటలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తామన్నారు.

జడ్చర్ల మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా దోరెపల్లి లక్ష్మి

బాదేపల్లి మున్సిపల్ కార్యాలయంలో జడ్చర్ల మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డితో కలిసి 23 మంది తెరాస కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణ అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లను ఎన్నుకున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులుండగా 23 వార్డుల్లో తెరాస అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్-2, భాజపా-2 వార్డులను గెలుచుకున్నాయి. జడ్చర్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలు తెరాసకు దక్కాయి.

ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. 8వ వార్డు నుంచి కౌన్సిలర్​గా గెలిచిన దోరెపల్లి లక్ష్మిని ఛైర్​పర్సన్​గా... 15వ వార్డు నుంచి గెలిచిన సారికను వైస్ ఛైర్​పర్సన్​గా ఎన్నుకున్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఒకే నామినేషన్ రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ప్రకటించారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్చర్ల పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పాలక వర్గం పనిచేస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన పాలక వర్గానికి, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్​పర్సన్లకు శుభాకాంక్షలు తెలిపారు.

కొవిడ్ నిబంధనలకు లోబడి సభ్యులందరి చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ నెగటివ్ ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారానికి అనుమతించారు.

ఇదీ చూడండి: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, పాలక వర్గాల ప్రమాణ స్వీకారం సహా ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అచ్చంపేట పురపాలిక పాలకవర్గం ప్రమాణ స్వీకారం బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా తెరాస నుంచి గెలిచిన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. తొలుత కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కొవిడ్ వల్ల హాజరుకాని మూడు, ఆరు, 18, 13 వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరుకాలేదు. వారిచేత డిజిటల్ విధానం ద్వారా ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం ఛైర్మన్, వైస్​ఛైర్మన్​ల ఎన్నిక జరిగింది. అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులుండగా తెరాస 13, కాంగ్రెస్-6 భాజపా-1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఛైర్మన్ పదవి తెరాసకు దక్కింది. ఈ పదవి జనరల్​కు రిజర్వ్ కాగా 16వవార్డు నుంచి గెలిచిన ఎడ్ల నర్సింహ గౌడ్​ ఛైర్మన్​గా, 19వ వార్డు నుంచి గెలుపొందిన శైలజారెడ్డిని వైస్​ ఛైర్మన్​గా ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే కౌన్సిలర్లతో సమావేశమైన మంత్రి నిరంజన్ రెడ్డి అధిష్ఠానం సూచన మేరకే వీరిద్దరినీ ఎంపిక చేశామని వెల్లడించారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్, వైస్ ఛైర్ పర్సన్లకు గువ్వల బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు. అచ్చంపేటలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తామన్నారు.

జడ్చర్ల మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా దోరెపల్లి లక్ష్మి

బాదేపల్లి మున్సిపల్ కార్యాలయంలో జడ్చర్ల మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డితో కలిసి 23 మంది తెరాస కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణ అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లను ఎన్నుకున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులుండగా 23 వార్డుల్లో తెరాస అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్-2, భాజపా-2 వార్డులను గెలుచుకున్నాయి. జడ్చర్ల ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలు తెరాసకు దక్కాయి.

ఛైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. 8వ వార్డు నుంచి కౌన్సిలర్​గా గెలిచిన దోరెపల్లి లక్ష్మిని ఛైర్​పర్సన్​గా... 15వ వార్డు నుంచి గెలిచిన సారికను వైస్ ఛైర్​పర్సన్​గా ఎన్నుకున్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఒకే నామినేషన్ రావడం వల్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తేజస్ నంద్లాల్ పవార్ ప్రకటించారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం చేశారు. జడ్చర్ల పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా నూతన పాలక వర్గం పనిచేస్తుందని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన పాలక వర్గానికి, ఛైర్ పర్సన్, వైస్ ఛైర్​పర్సన్లకు శుభాకాంక్షలు తెలిపారు.

కొవిడ్ నిబంధనలకు లోబడి సభ్యులందరి చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. కొవిడ్ నెగటివ్ ఉన్న వారిని మాత్రమే ప్రమాణ స్వీకారానికి అనుమతించారు.

ఇదీ చూడండి: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.