ETV Bharat / state

కేఎల్​ఐ పంపు హౌస్​లో 22 మీటర్లు తగ్గిన నీటి మట్టం

author img

By

Published : Oct 23, 2020, 9:54 PM IST

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం వద్ద కేఎల్​ఐ పంపు హౌస్​లోకి చేరిన నీటిని అధికారులు ఎత్తిపోస్తున్నారు. 600 హెచ్పీ కెపాసిటీ గల మోటార్లతో నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకు 22 మీటర్లు తగ్గినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

22 meters decreased water levels in kli pump house
22 meters decreased water levels in kli pump house

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం వద్ద కేఎల్​ఐ పంపు హౌస్​లోకి చేరిన నీటిని తొలగించే ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు రోజుల కిందట పంప్​హౌస్​లోకి దాదాపు 50 మీటర్ల పైగా నీరు చేరుకోవటం వల్ల పూర్తిగా మోటర్​లతో సహా మూడు భవనాలు మునిగిపోయాయి. ప్రాజెక్టు అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన అధికారి స్మిత సబర్వాల్ ప్రాజెక్ట్​ను సందర్శించిన తర్వాత నీటి తొలగింపును ముమ్మరం చేశారు.

పంపు మోటార్​ల నుంచి నీటిని దాదాపు తొమ్మిది 600 హెచ్పీ కెపాసిటీ గల మోటార్లతో నీటిని ఎత్తివేస్తున్నారు. ఇప్పటి వరకు 22 మీటర్లు తగ్గినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇంకా 16 మీటర్లకు పైగా నీటిని ఎత్తివేస్తే మోటర్లు పూర్తిగా తేలే అవకాశం ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో నీటిని పూర్తిగా ఎత్తి పోసే అవకాశం ఉందన్నారు.

వైజాగ్ నుంచి 15 మంది గజ ఈతగాళ్లు వచ్చి పంప్​హౌస్​లోని మోటార్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నీటిలోకి వెళ్లి మోటార్స్​ను పరిశీలిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇదీచూడండి: 'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం వద్ద కేఎల్​ఐ పంపు హౌస్​లోకి చేరిన నీటిని తొలగించే ప్రక్రియ వేగవంతమైంది. నాలుగు రోజుల కిందట పంప్​హౌస్​లోకి దాదాపు 50 మీటర్ల పైగా నీరు చేరుకోవటం వల్ల పూర్తిగా మోటర్​లతో సహా మూడు భవనాలు మునిగిపోయాయి. ప్రాజెక్టు అధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన అధికారి స్మిత సబర్వాల్ ప్రాజెక్ట్​ను సందర్శించిన తర్వాత నీటి తొలగింపును ముమ్మరం చేశారు.

పంపు మోటార్​ల నుంచి నీటిని దాదాపు తొమ్మిది 600 హెచ్పీ కెపాసిటీ గల మోటార్లతో నీటిని ఎత్తివేస్తున్నారు. ఇప్పటి వరకు 22 మీటర్లు తగ్గినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఇంకా 16 మీటర్లకు పైగా నీటిని ఎత్తివేస్తే మోటర్లు పూర్తిగా తేలే అవకాశం ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో నీటిని పూర్తిగా ఎత్తి పోసే అవకాశం ఉందన్నారు.

వైజాగ్ నుంచి 15 మంది గజ ఈతగాళ్లు వచ్చి పంప్​హౌస్​లోని మోటార్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. నీటిలోకి వెళ్లి మోటార్స్​ను పరిశీలిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ఇదీచూడండి: 'రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.