ములుగు తెరాస కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు ములుగును జిల్లాగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. పోడు భూములు సాగు చేసే రైతులకు శాశ్వత పట్టాలందిస్తానని తెలిపారు. మహబూబాబాద్ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి :రాష్ట్రం తరతారలపాటు పచ్చగుండాలే...!