ETV Bharat / state

హాజీపూర్​ బాధిత కుటుంబాలను విడుదల చేయాలి

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని అనుమానం వస్తుందన్నారు కాంగ్రెస్​ సీనియర్ నేత వి.హనుమంతరావు. మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్ పోలీసు స్టేషన్​లో ఉన్న హాజీపూర్ బాధిత కుటుంబాలను ఆయన కలుసుకున్నారు.

author img

By

Published : May 18, 2019, 1:30 PM IST

పోలీసులతో మాట్లాడుతున్న వీహెచ్​

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హాజీపూర్ బాధిత కుటుంబాలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు ఖండించారు. వారిని కలిసేందుకు జవహర్​నగర్ పీఎస్​కు వచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్ట్​లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస హత్యలు చేస్తున్న మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయకుండా బాధితులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హాజీపూర్​ బాధిత కుటుంబాలను విడుదల చేయాలి

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ కోసం లుక్​ అవుట్​ నోటీసులు

ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హాజీపూర్ బాధిత కుటుంబాలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత వి.హనుమంతరావు ఖండించారు. వారిని కలిసేందుకు జవహర్​నగర్ పీఎస్​కు వచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్ట్​లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస హత్యలు చేస్తున్న మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయకుండా బాధితులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హాజీపూర్​ బాధిత కుటుంబాలను విడుదల చేయాలి

ఇవీ చూడండి: రవిప్రకాశ్​ కోసం లుక్​ అవుట్​ నోటీసులు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.