ETV Bharat / state

తెరాస పథకాలపై ఇతర రాష్ట్రాల చూపు: మలిపెద్ది సుధీర్ రెడ్డి

author img

By

Published : Apr 27, 2021, 12:21 PM IST

తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌సింగారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.

trs
trs

తెరాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌సింగారం గ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు.

తెరాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌సింగారం గ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.