ETV Bharat / state

కారు యూటర్న్​ చేస్తుండగా ప్రమాదం.. ఒకరు దుర్మరణం - మేడ్చల్​ జిల్లా తాజా వార్తలు

మేడ్చల్​ జిల్లా షాపూర్​నగర్​లో కారు యూటర్న్ చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలవ్వగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

కారు యూటర్న్​ చేస్తుండగా ప్రమాదం
కారు యూటర్న్​ చేస్తుండగా ప్రమాదం
author img

By

Published : Jun 1, 2020, 11:01 AM IST

మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు యూటర్న్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కంటైనర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో వెనక సీట్లో కూర్చున్న యాదగిరి (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ముందు సీట్లో కూర్చున్న వారికి బెలూన్లు తెరుచుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.

road-accident-at-jeedimetla-ps-range-of-medchal-district
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

తీవ్ర గాయాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరు మద్యం మత్తులో కారులో ప్రయాణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు

మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు యూటర్న్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కంటైనర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో వెనక సీట్లో కూర్చున్న యాదగిరి (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ముందు సీట్లో కూర్చున్న వారికి బెలూన్లు తెరుచుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.

road-accident-at-jeedimetla-ps-range-of-medchal-district
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

తీవ్ర గాయాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరు మద్యం మత్తులో కారులో ప్రయాణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.