ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బందికి పండ్ల అందజేత

author img

By

Published : May 28, 2020, 5:27 PM IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా వైరస్​తో కనిపించని యుద్ధం చేస్తున్నారని వైద్యారోగ్య సిబ్బందిని భాజపా ఎమ్మెల్యే రామచంద్రరావు ప్రశంసించారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ అల్వాల్​లోని ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆయన పండ్లను, పౌష్టికాహార పదార్థాలను అందించారు.

mlc ramchanadrarao distributes fruits to old a;wa; doctors
ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బందికి పండ్ల అందజేత

కరోనా కట్టడిలో భాగంగా వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న సేవలు... ఎంతో అభినందనీయమని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్​ అల్వాల్​లోని ప్రభుత్వ ఆస్పత్రులో సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆయన పౌష్టికాహార పదార్థాలను, పండ్లను పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. వైద్య సిబ్బంది నిద్రాహారాలు మాని, తమ కుటుంబాలను వదిలి.. ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా ప్రజలంతా లాక్​డౌన్​ పాటించడం వల్ల దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొంతమేర తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.

కరోనా కట్టడిలో భాగంగా వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న సేవలు... ఎంతో అభినందనీయమని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్​ అల్వాల్​లోని ప్రభుత్వ ఆస్పత్రులో సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆయన పౌష్టికాహార పదార్థాలను, పండ్లను పంపిణీ చేశారు.

ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. వైద్య సిబ్బంది నిద్రాహారాలు మాని, తమ కుటుంబాలను వదిలి.. ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా ప్రజలంతా లాక్​డౌన్​ పాటించడం వల్ల దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొంతమేర తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.