మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జడ్పీ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ అంశాలపై సమీక్ష జరిపారు. అధికారులు అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులని నిర్వహించాలని ఎంపీ రేవంత్ తెలిపారు. పలు రకాల సమస్యలపై అధికారులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'కేసీఆర్.. కాంగ్రెస్తో కలిసి నడవండి'